Shabbir Ali: మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్.. కామారెడ్డికి వస్తారా?: షబ్బీర్ అలీ
మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం కేసీఆర్ కామారెడ్డికి వస్తారా? అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన గద్దర్ను ప్రగతిభవన్కు రానివ్వలేదని ఆరోపించారు.
కామారెడ్డి: మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం కేసీఆర్ కామారెడ్డికి వస్తారా? అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన గద్దర్ను ప్రగతిభవన్కు రానివ్వలేదని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీకి సీఎం కేసీఆర్ సిద్ధమైన నేపథ్యంలో షబ్బీర్ అలీ స్పందించారు. భారాస, భాజపా కలిసిపోయి ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.
‘‘రాష్ట్ర సంపదను కేసీఆర్ మహారాష్ట్రలో ఖర్చు చేస్తున్నారు. భారాస ప్రకటించిన టికెట్లలో మహిళలకు 33 శాతం ఎందుకు ఇవ్వలేదు? ఎస్సీలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదు. దళిత ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వని భారాసకు.. ఎస్సీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. రాష్ట్రంలో కేవలం కల్వకుంట్ల పాలనే కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పచ్చి అబద్ధాల మనిషి. భారాస, కాంగ్రెస్కు ఎప్పటికీ ఒక్కటి కాదు’’ అని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఆస్ట్రేలియా విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!