Shabbir Ali: మంత్రులకే అపాయింట్‌మెంట్‌ ఇవ్వని కేసీఆర్.. కామారెడ్డికి వస్తారా?: షబ్బీర్‌ అలీ

మంత్రులకే అపాయింట్‌మెంట్‌ ఇవ్వని సీఎం కేసీఆర్ కామారెడ్డికి వస్తారా? అని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన గద్దర్‌ను ప్రగతిభవన్‌కు రానివ్వలేదని ఆరోపించారు.

Published : 28 Aug 2023 16:03 IST

కామారెడ్డి: మంత్రులకే అపాయింట్‌మెంట్‌ ఇవ్వని సీఎం కేసీఆర్ కామారెడ్డికి వస్తారా? అని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన గద్దర్‌ను ప్రగతిభవన్‌కు రానివ్వలేదని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీకి సీఎం కేసీఆర్‌ సిద్ధమైన నేపథ్యంలో షబ్బీర్‌ అలీ స్పందించారు. భారాస, భాజపా కలిసిపోయి ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.

‘‘రాష్ట్ర సంపదను కేసీఆర్‌ మహారాష్ట్రలో ఖర్చు చేస్తున్నారు. భారాస ప్రకటించిన టికెట్లలో మహిళలకు 33 శాతం ఎందుకు ఇవ్వలేదు? ఎస్సీలకు ఇచ్చిన హామీలను కేసీఆర్‌ నెరవేర్చలేదు. దళిత ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వని భారాసకు.. ఎస్సీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. రాష్ట్రంలో కేవలం కల్వకుంట్ల పాలనే కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పచ్చి అబద్ధాల మనిషి. భారాస, కాంగ్రెస్‌కు ఎప్పటికీ ఒక్కటి కాదు’’ అని షబ్బీర్‌ అలీ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని