సిక్కోలు రా‘మ్మోహన రాగం’
ఉత్తరాంధ్ర తీర జిల్లా శ్రీకాకుళం. వర్షపాతం ఎక్కువ. కానీ వాన నీటి ఆధారంగా ప్రాజెక్టులు సిద్ధం కాలేదు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ వంటి నదులు పారుతున్న ఈ నేలపై వ్యవసాయమే ప్రధాన ఆదరువు.
శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలో కింజరాపు దూకుడు
సొంత ఇమేజ్, ప్రభుత్వ వ్యతిరేకతతో హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్న రామ్మోహన్నాయుడు
శ్రీకాకుళం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి
ఉత్తరాంధ్ర తీర జిల్లా శ్రీకాకుళం. వర్షపాతం ఎక్కువ. కానీ వాన నీటి ఆధారంగా ప్రాజెక్టులు సిద్ధం కాలేదు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ వంటి నదులు పారుతున్న ఈ నేలపై వ్యవసాయమే ప్రధాన ఆదరువు. తీర ప్రాంతం ఉండటంతో చేపల వేటా జీవనాధారమే. ఇక్కడ అవకాశాల్లేక మత్స్యకారులు గుజరాత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. వంశధార వంటి ప్రధాన ప్రాజెక్టులనూ వైకాపా సర్కారు పూర్తి చేయలేకపోయింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఉత్తమాటగానే మిగిలిపోయింది. పరిశ్రమలు అంతంత మాత్రం. ఉపాధి కోసం యువత ఎదురుచూస్తోంది. ఐదేళ్లుగా అభివృద్ధి కార్యక్రమాలు పడకేశాయి. ఈ జిల్లాలో కీలక లోక్సభ నియోజకవర్గం శ్రీకాకుళంలో కింజరాపు రామ్మోహన్నాయుడు తెదేపా నుంచి హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకెళ్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కిందటి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఎదురుగాలి వీచినా ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు వైకాపా అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో.. మరోసారి రా‘మ్మోహన రాగమే’ వినిపించే సంకేతాలు కనిపిస్తున్నాయి.
కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి కుమారుడిగా రామ్మోహన్నాయుడికి ప్రజల్లో ప్రత్యేక అభిమానం ఉంది. యువతలో మంచి పట్టుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సొంత మనుషులున్నారు. వర్గ సమీకరణాల నేపథ్యంలో ప్రజామద్దతు అధికమే. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర అంశాలపై ఆయన లోక్సభలో గట్టిగా మాట్లాడటం ప్రజల్లో మంచి పేరు తెచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి తండ్రి తరహాలోనే ఆయనకు కేంద్రమంత్రి పదవి దక్కితే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి తోడ్పడుతుందని ఓటర్లు ఆశిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుండే రామ్మోహన్నాయుడు స్థానికంగానే ఉపాధి కల్పించే కార్యక్రమాలపై దృష్టి సారించాల్సి ఉంది. తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధి రామ్మోహన్నాయుడికి బలం. మాట తీరు, అందరినీ వెంటబెట్టుకెళ్లగలిగే నేర్పు ఆయనకు ప్రధాన ఆయుధాలవుతున్నాయి. శ్రీకాకుళం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో క్యాడర్, నాయకులను సమన్వయం చేస్తూ తన గెలుపుతో పాటు అసెంబ్లీ అభ్యర్థుల గెలుపులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు.
సమన్వయం లేక తిలక్ ఉక్కిరిబిక్కిరి
వైకాపా నుంచి లోక్సభ అభ్యర్థిగా పేరాడ తిలక్ బరిలో నిలిచారు. ఈ లోక్సభ పరిధిలోని ఏ శాసనసభ నియోజకవర్గంలోనూ పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవటం ఆయనకు పెద్ద సమస్య. తన సొంత నియోజకవర్గం టెక్కలిలో ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు, తిలక్కు మధ్య సంబంధ బాంధవ్యాలు అంతంత మాత్రమే. కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు తమకు ఓటేయమని అడుగుతున్నారు తప్ప తిలక్ పేరెత్తడం లేదు. పైగా జగన్ ఐదేళ్ల పాలనలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం, 22 మంది ఎంపీలను ఇచ్చినా జగన్ చెప్పిన మాట నిలబెట్టుకోకపోవడం ప్రతికూలాంశాలు అవుతున్నాయి. ఈ లోక్సభ నియోజకవర్గంలో ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, పలాస, టెక్కలి, పాతపట్నం శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
అవతలిపక్షం అరాచకమే అచ్చెన్నకు శ్రీరామరక్ష
నియోజకవర్గం: టెక్కలి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి గెలుపు వైపు అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెదేపా 23 స్థానాలకే పరిమితమైనప్పుడు కూడా అచ్చెన్న ఇక్కడ గెలుపొందారు. 2014-19 వరకు నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పనులను ప్రజలు వైకాపా పాలనతో పోల్చి చూస్తున్నారు. నియోజకవర్గంలో తెదేపా హయాంలో వేసిన రోడ్లు, నిర్మించిన మంచినీటి పథకాలు ఇప్పటికీ అక్కరకు వస్తున్నాయని గుర్తుచేసుకుంటున్నారు. కిందటి ఎన్నికల్లో వైకాపాకు మెజారిటీ వచ్చిన టెక్కలి, నందిగామ మండలాలు కూడా ఇప్పుడు తెదేపా వైపు మొగ్గు చూపుతున్నాయి. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో మద్దతు మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు సొంతింట్లోనే అసమ్మతి ఉంది. జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్న ఆయన భార్య వాణి దువ్వాడకు వ్యతిరేకంగా గళమెత్తడం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమయింది. మొన్నటి వరకు వైకాపాలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్లో చేరి, బరిలో నిలిచారు. ఆమె ఎన్ని ఓట్లు చీల్చినా అవన్నీ దువ్వాడకు నష్టం కలిగించేవే అంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ తన సామాజికవర్గం మద్దతు దక్కుతుందని ఆశిస్తున్నారు. అదే సమయంలో డబ్బులు విపరీతంగా వెదజల్లుతున్నారు. నియోజకవర్గంలో వైకాపా నాయకుడి అరాచకాలు తెదేపాకు కలిసి వస్తున్నాయి.
బగ్గు రమణమూర్తికే మొగ్గు
నియోజకవర్గం: నరసన్నపేట
మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఆయన కుటుంబసభ్యుల వ్యవహారశైలిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత తెదేపాకు కలిసివస్తోంది. మంత్రిగా పని చేసినా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా నియోజకవర్గంలో ధర్మాన కృష్ణదాస్ నామమాత్రంగా మారిపోయారని, ఆయన భార్య, కుమారులు, వ్యక్తిగత సహాయకులే మొత్తం హల్చల్ చేశారన్నది జనం మాట. వంశధార నదిలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారాల్లో ఆరోపణలు, బదిలీలు, భూముల వ్యవహారాల్లో కృష్ణదాస్ కుటుంబసభ్యులు, పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వంశధార ప్రాజెక్టు తెదేపా హయాంలోనే సింహభాగం పూర్తయినా వైకాపా ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయింది. కాలువల్లో నీరు పారించలేకపోయింది. దీంతో నియోజకవర్గంలో సాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ధర్మాన కుటుంబం, వారి అనుచరుల ఏకఛత్రాధిపత్యం వైకాపా నాయకులకూ రుచించలేదు. సారవకోట మండలాధ్యక్షుడు కూర్మి నాయుడు, జలుమూరు జడ్పీటీసీ సభ్యుడు శాంతి, డీసీసీబీ ఛైర్మన్ కుమారుడు డోల జగన్ వైకాపాను వదిలి తెదేపాలో చేరారు. 2014-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత తెదేపా అభ్యర్థి బగ్గు రమణమూర్తికి నియోజకవర్గంలో సంబంధ బాంధవ్యాలు ఎక్కువ. జడ్పీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన హయాంలో వంశధార పనులు వేగంగా జరిగాయి. రూ.12 కోట్లతో ఆస్పత్రి మంజూరు చేయించి 60 శాతం పనులు పూర్తి చేయించారు. ఇవన్నీ ఇప్పుడు కలిసొస్తున్నాయి.
అవాంతరాలు దాటి గట్టి పోటీ ఇస్తున్నతెదేపా
నియోజకవర్గం: పాతపట్నం
ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై ఉన్న తీవ్ర వ్యతిరేకత, పార్టీలో కీలక నాయకుల ఫిరాయింపులు వైకాపాను ఇబ్బంది పెడుతున్నాయి. తెదేపా అంతర్గత సమస్యలను పరిష్కరించుకుని కలిసికట్టుగా అడుగులు వేస్తోంది. ఈ నియోజకవర్గంలో తొలుత హోరాహోరీగా ఉన్నా.. పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటూ తెదేపాకు ముందుకెళుతోంది. ఇక్కడ అభ్యర్థిత్వం ఆశించిన కలమట వెంకటరమణను పార్టీ అధినేత చంద్రబాబు పిలిచి మాట్లాడారు. ఆయనకు శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. లోక్సభ అభ్యర్థి రామ్మోహన్నాయుడు ఇక్కడి నాయకులు కలిసి పని చేసేలా అవగాహన కుదిర్చారు. వైకాపా అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్థానికురాలు కారు. ఆమె తీరుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులే బహిరంగంగా గళం వినిపించినా, ఆమెకు కాకుండా ఎవరికి టికెటిచ్చినా మద్దతు పలుకుతామని చెప్పినా అధిష్ఠానం పట్టించుకోలేదు. రెడ్డి శాంతికే మళ్లీ టికెటివ్వడంతో కొత్తూరు మండల ఉపాధ్యక్షులు లోతుగడ్డ తులసీ వరప్రసాద్, హిరమండలం మండలాధ్యక్షురాలు మేనక తెదేపాలో చేరిపోయారు. రెడ్డి శాంతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడమూ ప్రతికూలంగా ఉంది. వంశధార ప్రాజెక్టు పూర్తి చేయలేదు. తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. గిరిజన ప్రాంతానికి ఐటీడీఏను ఏర్పాటు చేయించలేకపోయారు. ధన ప్రవాహంతో మద్దతు కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
- శ్రీకాకుళం నియోజకవర్గంలో సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావుకు తెదేపా అభ్యర్థి గొండు శంకర్ గట్టి సవాల్ విసురుతున్నారు. వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత, యువకుల్లో పట్టు కలిసొస్తున్నాయి.
- పలాసలో మరో మంత్రి అప్పలరాజుపై తెదేపా అభ్యర్థి గౌతు శిరీష హోరాహోరీ పోరాడుతున్నారు.
- ఆమదాలవలస నియోజకవర్గంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం గెలవడం కష్టమేనన్న ప్రచారం తీవ్రస్థాయికి చేరింది. ఆయన తన మేనల్లుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
తెదేపా పట్టు, జనసేన బలం కీలకాంశాలు
నియోజకవర్గం: ఇచ్ఛాపురం
ఈ నియోజకవర్గం తెదేపాకు కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఒక్కసారి మాత్రమే ఓటమిపాలయింది. పార్టీకి ఉన్న ఆ బలమే ఈసారి కూడా అభ్యర్థి బెందాళం అశోక్కు అనుకూలమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తోడవుతోంది. ఇచ్చాఫురం మున్సిపాలిటీ, మండలం, కవిటి మండలాల్లో తెదేపాకు పట్టుంది. గతంలో సోంపేటలో తెదేపాకు పట్టు ఉన్నా కిందటి ఎన్నికల్లో వైకాపాకు మెజారిటీ వచ్చింది. ప్రస్తుతం పోటాపోటీగా మారింది. అన్ని మండలాల్లోనూ వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపాలోకి వస్తున్నారు. జనసేనతో పొత్తు కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. సంఖ్యాపరంగా రెండో పెద్ద సామాజికవర్గమైన వ్యక్తి జనసేన నాయకుడిగా యువతను కదిలించి గట్టిగా పనిచేస్తుండటం అశోక్కు అనుకూలంగా మారుతోంది. వైకాపా అభ్యర్థి పిరియా విజయ నియోజకవర్గంలో బాగా తిరిగారు. జడ్పీ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలో క్యాడర్ బలం పెంచుకున్నారు. నియోజకవర్గంలో ఆమె పెద్దగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలేమీ లేవు. అందుకే డబ్బు బాగా ఖర్చు చేస్తున్నారు. గ్రామస్థాయి నాయకులు చేజారిపోకుండా డబ్బులు వెదజల్లుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్