భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది.
పౌరుల ఆస్తులకు ఎసరు పెట్టేలా రూపకల్పన
జిల్లా జడ్జితో ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయని వైనం
టీఆర్వోగా అధికారిని నియమించమంటే ఏ ‘వ్యక్తినైనా’ నియమించొచ్చంటారా?
ఈనాడు, అమరావతి: ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. పౌరుల స్థిరాస్తులకు ఎసరు పెట్టేలా.. నచ్చిన విధంగా ఈ చట్టాన్ని రూపొందించుకుంది. ప్రభుత్వ పెద్దలు మాత్రం అది కేంద్రం సూచించిన చట్టం, మాదేం తప్పులేదన్నట్లు ఊదరగొడుతున్నారు. నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన నమూనా టైటిలింగ్ చట్టం.. సీఎం జగన్ సర్కారు తెచ్చిన యాక్ట్ను పక్కన పెట్టుకొని అధ్యయనం చేస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. దేశంలో ఈ చట్టాన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వైకాపా గర్వంగా చెబుతోంది. అలాంటప్పుడు నీతి ఆయోగ్ నమూనా చట్టం స్ఫూర్తికి ఎందుకు తూట్లు పొడిచారనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏమి సూచించింది. జగన్ ప్రభుత్వం ఎలాంటి చట్టాన్ని తెచ్చిందో పరిశీలిద్దాం.
వెంటనే రద్దు చేయాలి..
- సీనియర్ న్యాయవాది నీలం రామమోహన్రావు, టైటిలింగ్ యాక్ట్పై గుంటూరు జిల్లా కార్యక్రమాల సమన్వయకర్త
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత దుర్మార్గమైన చట్టం. ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను అధికారంలో ఉన్నవాళ్లు కొట్టేయడానికి అనువుగా దీన్ని తెచ్చారు. నీతి ఆయోగ్ సూచించిన ఆంశాలను తీసేసి.. వైకాపా ప్రభుత్వం వాళ్లకు అనుకూలంగా జోడించుకొని ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలి’
నీతి ఆయోగ్ నమూనా టైటిలింగ్ చట్టం
1) సెక్షన్ 5 ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (టీఆర్వో)గా ఏ అధికారినైనా నియమించొచ్చు
2) టైటిల్ వివాదం ఉన్నట్లు టీఆర్వో గుర్తిస్తే.. సెక్షన్ 10 కింద వివాదాల రిజిస్టర్లో వివరాలు నమోదు చేసి ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ (ఎల్డీఆర్వో) వద్దకు పంపాలి
3) ఎల్డీఆర్వో ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎల్టీఏటీ)ను ఆశ్రయించేందుకు సెక్షన్ 15 వెసులుబాటు ఇస్తుంది. సెక్షన్ 36 ప్రకారం ఈ ట్రైబ్యునళ్లకు జిల్లా జడ్జి ర్యాంక్ కలిగిన జ్యుడిషియల్ అధికారి లేదా విశ్రాంత జ్యుడిషియల్ అధికారి నేతృత్వం వహించాల్సి ఉంటుంది. న్యాయశాస్త్రం తెలిసిన జ్యుడిషియల్ అధికారితో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో అప్పీలేట్ ట్రైబ్యునళ్లను నీతి ఆయోగ్ ఏర్పాటు చేయమంది.
4) రికార్డుల్లో యజమాని పేర్లను ఓసారి చేర్చి నోటిఫై చేశాక.. ‘మూడేళ్ల’లోపు ఎవరు అభ్యంతరం చెప్పకపోతే యాజమాన్య హక్కు విషయంలో ఈ వివరాలను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించొచ్చు.
5) ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సెక్షన్ 16 ప్రకారం హైకోర్టులో ‘అప్పీల్’ దాఖలు చేసుకోవచ్చు.
6) టైటిలింగ్ రిజస్ట్రేషన్ ఆఫీసర్ (టీఆర్వో) తర్వాత భూ యాజమాన్య హక్కు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు నమూనా టైటిలింగ్ చట్టం ‘మూడు అంచెల’ వ్యవస్థను సిఫార్సు చేసింది.1 ల్యాండ్ డిస్ప్యూట్ రెజుల్యూషన్ ఆఫీసర్. 2 ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ట్రైబ్యునల్. 3 హైకోర్టులో అప్పీల్.
7) జిల్లా జడ్జి నేతృత్వం వహించే ట్రైబ్యునల్కు, అధికారికి తప్పుడు సమాచారం ఇచ్చినా.. దాచినా, ఇవ్వకపోయినా సంబంధిత వ్యక్తికి సెక్షన్ 62 ప్రకారం మూడేళ్ల వరకు జైలుశిక్ష లేదా రూ.50వేల జరిమానా లేదా రెండింటికీ బాధ్యులవుతారు.
జగన్ ప్రభుత్వం తెచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం
1) సెక్షన్ 5 ప్రకారం టీఆర్వోగా ఏ వ్యక్తినైనా నియమించొచ్చు. ఇందులోనే కుట్ర కోణముంది.
2) ఇందులో ఎల్డీఆర్వో ప్రస్తావనే లేదు. ఆ నియమకానికి పాతరేశారు. నేరుగా ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ని ఆశ్రయించాలని పేర్కొన్నారు.
3) ఈ చట్టంలో సెక్షన్ 36ప్రకారం అప్పీలేట్ ట్రైబ్యునళ్ల ఊసేలేదు. ట్రైబ్యునళ్ల స్థానంలో ఆయా జిల్లా సంయుక్త కలెక్టర్ హాదాకు తగ్గని అధికారిని లేదా విశ్రాంత అధికారిని ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ (ఎల్టీఏవో)గా నియమించారు. అప్పీలేట్ ట్రైబ్యునళ్లకు పాతరేసి.. సంయుక్త కలెక్టర్ స్థాయిలో అప్పీలేట్ అధికారిని మాత్రమే నియమించుకునేందు వీలు కల్పించారు.
4) రికార్డుల్లో నమోదైన యాజమాన్య హక్కుపై అభ్యంతరం వ్యక్తంచేసే గడవును ఈ చట్టంలో ‘రెండేళ్లకు’ (సెక్షన్ 13) కుదించారు. తర్వాత ఆ వివరాలను తిరుగులేనిసాక్ష్యంగా పరిగణించొచ్చు.
5) హైకోర్టులో ‘అప్పీల్’కు అవకాశం ఇవ్వలేదు. సెక్షన్ 16 కింద కేవలం ‘రివిజన్’ మాత్రమే దాఖలు చేసుకోవాలి.
6) ఈ చట్టం ద్వారా వివాదం పరిష్కరించుకునేందుకు కేవలం రెండంచెల వ్యవస్థకే పరిమితం చేశారు. టీఆర్వో తర్వాత 1. ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ అధికారి/సంయుక్త కలెక్టర్. 2 హైకోర్టులో రివిజన్కు అవకాశం కల్పించారు.
7) ఈ చట్టంలో ‘అథారిటీ’కి తప్పుడు సమాచారం ఇచ్చినా.. ఇవ్వకపోయినా ‘అధికారులే’ సంబంధిత వ్యక్తికి 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50వేల జరిమానా లేదా రెండింటినీ విధించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి. -
2 లక్షల మందికి బీసీజీ టీకా పూర్తి
రాష్ట్రంలో క్షయ(టీబీ) వ్యాధి వ్యాప్తి, కేసుల నియంత్రణకు బీసీజీ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా.. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, నంద్యాల, పల్నాడు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం, విజయనగరం, కడప జిల్లాల్లో గడిచిన 2 రోజుల్లో 2 లక్షల మందికి ఈ వ్యాక్సిన్ వేశారు. -
కౌండిన్య అభయారణ్యంలో అరుదైన కప్ప
తూర్పు కనుమల్లో భాగమైన చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కౌండిన్య అభయారణ్యంలో అరుదైన కప్పను గుర్తించినట్లు హైదరాబాద్కు చెందిన జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు డాక్టర్ దీపాపైస్వాల్, డాక్టర్ ఎస్.ఎస్.జాదవ్, డాక్టర్ కరుతపాండి శుక్రవారం తిరుపతిలో ఓ ప్రకటన విడుదల చేశారు. -
జడ్పీ అధికారుల అత్యుత్సాహం
ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సచివాలయ ఉద్యోగులను తీసుకునేందుకు కర్నూలు జడ్పీ సీఈవో కసరత్తు చేయడం దుమారం రేపింది. పైగా.. కలెక్టరు ఆదేశాల మేరకే ఈ ప్రక్రియ చేపట్టామని తెలపడం విస్మయానికి గురి చేసింది. -
కలెక్టర్, ఎస్పీల నియామకంపై ఈసీకి అధికారుల జాబితా
కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన పల్నాడు, అనంతపురం ఎస్పీలు, బదిలీ చేసిన తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్ల స్థానంలో కొత్తవారిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి కొందరు అధికారుల పేర్లతో ఈసీకి జాబితాలు పంపించారు. -
ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. శ్రీసత్యసాయి, బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు కురిశాయి.