election results 2022: రావత్కు షాక్..దేవుడిచ్చిన తీర్పన్న సిద్ధూ..కీలక నేతల ఫలితాలిలా..
తాజాగా వెలువడుతోన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా దూసుకెళ్తోంది. పంజాబ్లో ఆప్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కదులుతోంది. ఇక కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో పరాజయం మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతానికి కీలక నేతల ఫలితాలిలా ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: తాజాగా వెలువడుతోన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా దూసుకెళ్తోంది. పంజాబ్లో ఆప్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కదులుతోంది. ఇక కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో పరాజయం మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతానికి కీలక నేతల ఫలితాలిలా ఉన్నాయి.
పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ విజయం..పంజాబ్లో ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ దురి నుంచి విజయం సాధించారు. ఆయన 45 వేల ఓట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై గెలుపొందారు.
గోవా సీఎం సావంత్ గెలుపు..గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఉత్తర గోవాలోని సాంక్వెలిమ్ నుంచి విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో భాజపా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి ఓటమి..పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. పటియాలా అర్బన్ నియోజకవర్గంలో పోటీ పడిన ఆయన.. ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.
దివంగత నేత మనోహర్ పారికర్ తనయుడి పరాజయం..భాజపా టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు ఉత్పాల్ పారికర్. గోవాలోని పనాజీ నియోజకవర్గం నుంచి పోటీ పడి.. 800 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆయన దివంగత నేత మనోహర్ పారికర్ తనయుడు. మనోహర్ గోవా ముఖ్యమంత్రి, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా సేవలు అందించారు.
హరీశ్ రావత్కు ఎదురుదెబ్బ...ఉత్తరాఖండ్ మాజీ మఖ్యమంత్రి హరీశ్ రావత్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. లాల్కౌనా నుంచి 10 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడారు. ఈయన ఆధ్వర్యంలోనే ఉత్తరాఖండ్లో ఎన్నికల ప్రచారం సాగింది.
ఓటమి అంగీకరించిన సిద్ధూ..‘ప్రజా తీర్పే దేవుడి తీర్పు. ప్రజల ఆదేశాన్ని వినయంగా అంగీకరిస్తున్నాం. ఆప్కి అభినందనలు’ అంటూ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్వీట్ చేశారు. అమృత్సర్ ఈస్ట్ నుంచి పోటీపడిన ఆయన ఓటమి చెందారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండు స్థానాల నుంచి పోటీ పడిన ఆయన్నూ పరాజయమే పలకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్