చమురు ధరలపై ప్రధానికి సోనియా లేఖ
దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు వరుసగా పెరుతుండడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల కష్టంతో ప్రత్వం లాభాలను గడిస్తోందని ఆరోపించారు. వెంటనే పెరిగిన చమరు ధరలను..
దిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు వరుసగా పెరగడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల కష్టంతో ప్రభుత్వం లాభాలను గడిస్తోందని ఆరోపించారు. వెంటనే పెరిగిన చమురు ధరలను తగ్గించాలని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆమె లేఖ రాశారు. ఓ వైపు దేశ జీడీపీ క్షీణిస్తుంటే.. మరోవైపు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని దుయ్యబట్టారు.
చమురు, గ్యాస్ ధరలు పెరుగుదలతో ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలు చూసి ఈ లేఖ రాస్తున్నట్లు సోనియా పేర్కొన్నారు. దేశంలో ఉద్యోగాలు హరించుకుపోయాయని, ఆదాయాలు దారుణంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో లాభార్జనపై ప్రభుత్వం సారించడం బాధాకరమని విమర్శించారు.
దేశంలో ఎప్పుడూ లేని స్థాయికి చమురు ధరలు చేరాయని సోనియా అన్నారు. ఓ వైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా.. చమురు ధరలు నిరంతరం పెరగడాన్ని ఆమె తప్పుబట్టారు. యూపీఏ హయాంతో పోల్చుకుంటే ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు సగం మాత్రమే ఉన్నాయని చెప్పారు. అధికారం చేపట్టి నేటికి ఏడేళ్లు గడస్తున్నా.. మీ ప్రభుత్వ వైఫల్యాలకు గత ప్రభుత్వాలను బాధ్యులను చేయడమేంటని ప్రశ్నించారు. దేశీయ చమురు ఉత్పత్తి 2020లో 18 ఏళ్ల కనిష్ఠానికి చేరిందన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. స్వప్రయోజనాలు వీడి ప్రజలపై భారం పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ అంశంలో సాకులు వెతక్కుండా సమస్యకు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నట్లు సోనియా హితవు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?