చమురు ధరలపై ప్రధానికి సోనియా లేఖ

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు వరుసగా పెరుతుండడంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల కష్టంతో ప్రత్వం లాభాలను గడిస్తోందని ఆరోపించారు. వెంటనే పెరిగిన చమరు ధరలను..

Published : 21 Feb 2021 20:23 IST

దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు వరుసగా పెరగడంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల కష్టంతో ప్రభుత్వం లాభాలను గడిస్తోందని ఆరోపించారు. వెంటనే పెరిగిన చమురు ధరలను తగ్గించాలని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆమె లేఖ రాశారు. ఓ వైపు దేశ జీడీపీ క్షీణిస్తుంటే.. మరోవైపు గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరుగుతున్నాయని దుయ్యబట్టారు. 

చమురు, గ్యాస్‌ ధరలు పెరుగుదలతో ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలు చూసి ఈ లేఖ రాస్తున్నట్లు సోనియా పేర్కొన్నారు. దేశంలో ఉద్యోగాలు హరించుకుపోయాయని, ఆదాయాలు దారుణంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో లాభార్జనపై ప్రభుత్వం సారించడం బాధాకరమని విమర్శించారు.

దేశంలో ఎప్పుడూ లేని స్థాయికి చమురు ధరలు చేరాయని సోనియా అన్నారు. ఓ వైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుతున్నా.. చమురు ధరలు నిరంతరం పెరగడాన్ని ఆమె తప్పుబట్టారు. యూపీఏ హయాంతో పోల్చుకుంటే ప్రస్తుతం క్రూడాయిల్‌ ధరలు సగం మాత్రమే ఉన్నాయని చెప్పారు. అధికారం చేపట్టి నేటికి ఏడేళ్లు గడస్తున్నా.. మీ ప్రభుత్వ వైఫల్యాలకు గత ప్రభుత్వాలను బాధ్యులను చేయడమేంటని ప్రశ్నించారు. దేశీయ చమురు ఉత్పత్తి 2020లో 18 ఏళ్ల కనిష్ఠానికి చేరిందన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. స్వప్రయోజనాలు వీడి ప్రజలపై భారం పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ అంశంలో సాకులు వెతక్కుండా సమస్యకు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నట్లు సోనియా హితవు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని