Andhra News: ఎంపీ అవినాష్ రెడ్డి కేసు అంతులేని కథ: గోరంట్ల
వైఎస్ జగన్ అరాచకాలకు రాష్ట్ర ప్రజలు సెలవు చెప్పాలని చూస్తున్నారని తెలుగుదేశం నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
రాజమహేంద్రవరం: ఏపీ సీఎం వైఎస్ జగన్ అరాచకాలకు రాష్ట్ర ప్రజలు సెలవు చెప్పాలని చూస్తున్నారని తెలుగుదేశం నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మహానాడును విజయవంతం చేసిన తెదేపా కార్యకర్తలు, అభిమానులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆతిథ్యం ఇవ్వడంలో తెలుగుదేశాన్ని మించింది లేదన్నారు. తెదేపా తొలి విడత మేనిఫెస్టోని ప్రజలు ఆదరిస్తారని.. దసరాకి పూర్తి స్థాయి మేనిఫెస్టో వస్తుందని చెప్పారు.
‘‘మహానాడు బ్యానర్లు కట్టుకుంటే మధ్యలో ఎంపీ భరత్ దూరి వైకాపా ఫ్లెక్సీలు కడుతున్నారు. తిరిగి మా మీదే కేసులు పెడుతున్నారు. రాజమహేంద్రవరంలో అధికారులతో కలిసి ఎంపీ ఆటలాడుకుంటున్నారు. సవాల్ విసురుతున్నా.. పోలీసులు చుట్టూ లేకుండా వైకాపా నేతలు ఎవరైనా బయటకు రాగలరా?’’ అని ఆయన ప్రశ్నించారు.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపైనా ఆయన స్పందిస్తూ.. సీఎం జగన్ దిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసు విషయం బ్రేకులు పడుతూనే ఉందన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తారా? అని ఆయన నిలదీశారు. అవినాష్ రెడ్డి కేసు అంతులేని కథ అని గోరంట్ల వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భైంసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురువారం నిర్మల్ జిల్లా బైంసాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
సంక్షోభం వేళ చౌతాలాకు షాక్.. భాజపా గూటికి పార్టీ ఎమ్మెల్యేలు..!
Haryana Crisis: హరియాణాలో రాజకీయ సంక్షోభం వేళ జేజేపీ నాయకుడు దుశ్యంత్ చౌతాలాకు షాక్ తగిలింది. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు భాజపా గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో సైనీ ప్రభుత్వం మెజార్టీ సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
హరియాణా సంక్షోభం.. ‘బలపరీక్ష’కు భాజపా మాజీ మిత్రుడి డిమాండ్
Haryana: హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్కు జేజేపీ నాయకుడు దుశ్యంత్ చౌటాలా లేఖ రాశారు. -
శాంపిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ కాంగ్రెస్ నేత శాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలను తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఖండించారు. -
తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణ.. కుంకలగుంటలో పోలీసుల బందోబస్తు
జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. -
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?