Andhra News: అవసరం తీరే వరకే ఆయన అన్నా.. అన్నా అని వెంటపడతారు: యనమల

ఉద్యోగులను వాడుకొని వదిలేయడంలో సీఎం జగన్‌ను మించిన వారు లేరని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు....

Published : 16 Feb 2022 14:11 IST

అమరావతి: ఉద్యోగులను వాడుకొని వదిలేయడంలో సీఎం జగన్‌ను మించిన వారు లేరని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అవసరం తీరే వరకే అన్నా.. అన్నా అంటూ వెంటపడతారని ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో యనమల మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేయించేందుకు గౌతమ్‌ సవాంగ్‌ను వాడుకున్న సీఎం ఇప్పుడు అవమానకర రీతిలో సాగనంపారన్నారు.

డీజీపీ స్థాయి వ్యక్తికి పోస్టింగ్‌ ఇవ్వకపోవడం అవమానించడమే అన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేశ్‌, అజయ్‌ కల్లంల పట్ల ఇదే విధంగా వ్యవహరించారన్నారు. చీకటి జీవోల ఆద్యుడు ప్రవీణ్‌ ప్రకాశ్‌ను ఆకస్మికంగా దిల్లీ పంపేశారని యనమల దుయ్యబట్టారు. జగన్‌రెడ్డి వ్యవహార శైలిని, నైజాన్ని ఉద్యోగులు, పోలీసులు అర్థం చేసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని