CM Kcr: రేపు ముంబయి వెళ్లనున్న సీఎం కేసీఆర్... ఉద్దవ్ ఠాక్రేతో భేటీ
కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా విధానాలపై పోరాటం, దేశ రాజకీయాల్లో మార్పే ఎజెండాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ముంబయి వెళ్లనున్నారు. మహారాష్ట్ర
హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా విధానాలపై పోరాటం, దేశ రాజకీయాల్లో మార్పే ఎజెండాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ముంబయి వెళ్లనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ దేశ ఆర్థిక రాజధానికి పయనంకానున్నారు. ఇటీవల కేసీఆర్కు ఫోన్ చేసిన మహారాష్ట్ర సీఎం.. భాజపా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకునేందుకు సరైన సమయంలో గళం విప్పారన్న ఉద్దవ్ ఠాక్రే.. దేశ సమగ్రతను కాపాడేందుకు పోరాటం కొనసాగించాలని, ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. ముంబయి వచ్చి తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని, భవిష్యత్ కార్యాచరణపై చర్చిద్దామని ఉద్దవ్ కోరారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు రేపు ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. మధ్యాహ్నానానికి ముంబయి చేరుకుంటారు. బాంద్రా కుర్లాలోని ఉద్దవ్ నివాసానికి వెళ్లి అక్కడ ఆయనతో సమావేశమవుతారు. జాతీయ రాజకీయాలు, దేశ వ్యాప్త పరిస్థితులు, కేంద్రం-రాష్ట్రాల మధ్య సంబంధాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని పాలనాపరమైన అంశాలపై కూడా ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ వెంట కొంత మంది తెరాస నేతలు కూడా ముంబయి వెళ్లనున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కూడా సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
కడప జిల్లా వేంపల్లి మండలం కుమ్మరంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి చేదు అనుభవం ఎదురైంది. -
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.