MP Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు

బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణలో భాగంగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని విజయాసాయిరెడ్డి

Published : 07 Aug 2021 15:02 IST

హైదరాబాద్‌: బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణలో భాగంగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని విజయాసాయిరెడ్డి, సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 10వ తేదీన విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విజయసాయిరెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారని రఘురామ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని