AP News: జగన్‌కే కాదు.. గాడ్సేకూ అభిమానులున్నారు: చింతమనేని

రాష్ట్రంలోని ఎన్నికల జరగాల్సిన స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ ఇస్తే వైకాపాకు ముచ్చెమటలు పట్టిస్తామని

Updated : 22 Oct 2021 14:39 IST

అమరావతి: రాష్ట్రంలోని ఎన్నికల జరగాల్సిన స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ ఇస్తే వైకాపాకు ముచ్చెమటలు పట్టిస్తామని తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. ఇప్పుడు తెదేపా గెలవకుంటే పార్టీ కార్యాలయం మూసేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చింతమనేని మాట్లాడారు.

‘‘మంత్రి పదవి కోసమే ఇన్నాళ్లూ కొడాలి నాని తెదేపా నేతలను తిట్టారు. త్వరలోనే ఆయన పదవి పోవడం ఖాయం. జగన్‌కే కాదు.. గాడ్సేకు కూడా అభిమానులున్నారు. మేమూ ఉప్పూకారం తింటున్నాం.. మాకూ బీపీ వస్తుంది’’ అని చింతమనేని ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని