Mallikarjun Kharge: లూటీ చేసి దోస్తులకు పంచిపెట్టడమే మోదీ పనిగా పెట్టుకున్నారు: ఖర్గే
ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం రూ. 6 లక్షల కోట్ల నిధుల సమీకరణ కోసం జాతీయ సంపదను అమ్మేస్తున్నారని రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దీని...
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం రూ. 6 లక్షల కోట్ల నిధుల సమీకరణ కోసం జాతీయ సంపదను అమ్మేస్తున్నారని రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దీని ద్వారా సామాన్యులకు, దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికే రూ. 3.50 లక్షల కోట్ల విలువైన ఆస్తులను అమ్మేశారని ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చేందుకు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. వ్యాపారం వృద్ధి చెందితే దేశ సంపద పెరుగుతుందని.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం ద్వారా మిశ్రమ ఆర్థిక వృద్ధి జరుగుతుందని నెహ్రూ భావించినట్లు చెప్పారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపుగా 35 లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. పబ్లిక్ సెక్టార్, బ్యాంకింగ్, రైల్వే, బీమా రంగాలకు చెందిన సంస్థలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం ద్వారా రిజర్వేషన్లు పూర్తిగా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని పరోక్షంగా రిజర్వేషన్లు ఎత్తేసే పనిలో పడ్డారని విమర్శించారు. 1991లో పీవీ నరసింహారావు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించినా పబ్లిక్ సెక్టార్ను ఇబ్బంది పెట్టలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంపదను కాపాడితే భాజపా నేతలు అమ్మేస్తున్నారని మండిపడ్డారు. పబ్లిక్ సెక్టార్ను లూటీ చేయడం.. దోస్తులకు పంచి పెట్టడమే మోదీ పనిగా పెట్టుకున్నారని ఖర్గే ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్