AP News: ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు: మిథున్‌రెడ్డి

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ప్రభుత్వానికి లేదని వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు.

Published : 02 Jan 2022 14:00 IST

తిరుపతి: ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ప్రభుత్వానికి లేదని వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని తెదేపా అధినేత చంద్రబాబు నిన్న వెల్లడించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఐదేళ్లూ తాము అధికారంలో ఉంటామన్నారు. పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని మిథున్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతిలోని ఓ హోటల్‌ నూతనంగా తయారు చేసిన మొబైల్‌ యాప్‌ను ప్రారంభించిన ఆయన ఈ విధంగా మాట్లాడారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో చంద్రబాబు నిన్న ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందని ప్రచారం జరుగుతోంది కదా, మీరు సిద్ధమేనా అన్న ప్రశ్నకు తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు జవాబిచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని