Telangana News: మోదీ వ్యాఖ్యలపై నిరసన.. తెలంగాణ వ్యాప్తంగా తెరాస ఆందోళనలు
ఏపీ విభజనపై ప్రధాని మోదీ నిన్న రాజ్యసభలో అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మంత్రి కేటీఆర్ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు..
హైదరాబాద్: ఏపీ విభజనపై ప్రధాని మోదీ నిన్న రాజ్యసభలో అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా తెరాస నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
సికింద్రాబాద్లో తెరాస కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు, జెండాలతో బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు. మోతీనగర్, రాజీవ్నగర్, ఎస్ఆర్ నగర్ మీదుగా తెరాస నేతలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొని నిరసన తెలిపారు. కూకట్పల్లిలో తెరాస శ్రేణులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే కృష్ణారావు నేతృత్వంలో తెరాస కార్యకర్తల బైక్ ర్యాలీ నిర్వహించారు.
హైదరాబాద్లోని అజంపురా చౌరస్తాలో తెరాస కార్యకర్తలు నిరసనకు దిగారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. చాదర్ఘాట్ చౌరస్తా వరకు తెరాస కార్యకర్తలు బైకు ర్యాలీ నిర్వహించారు. గన్పార్క్ వద్ద తెరాస నాయకులు ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా ప్రధాని వ్యాఖ్యల చేశారని నిరసిస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. జేబీఎస్ వరకు ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు.
పిర్జాదిగూడ, బోడుప్పల్ నగర పాలక సంస్థల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మేయర్లు జక్కా వెంకట్ రెడ్డి, బుచ్చిరెడ్డి.. ఘట్ కేసర్, పోచారం మున్సిపాలిటీలలో ఛైర్మన్లు పావని యాదవ్, బోయపల్లి కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వరంగల్లో మేయర్ గుండు సుధారాణి నిరసనలో పాల్గొన్నారు.
కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భాజపా పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మేయర్ సునీల్రావు, తదితర తెరాస నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో తెరాస కార్యకర్తలు భారీ బ్యాక్ ర్యాలీ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్