‘ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మహిళలపై ఈ దాడులు’
యూపీలోని గోండ జిల్లాలో ముగ్గురు బాలికలపై యాసిడ్ దాడి జరగడాన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. ఈ విషయమై ఆమె యూపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. యోగి ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.
దిల్లీ: యూపీలోని గోండా జిల్లాలో ముగ్గురు బాలికలపై యాసిడ్ దాడి జరగడాన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. ఈ విషయమై ఆమె యూపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. యోగి ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఆమె యాసిడ్ బాధిత బాలికల తండ్రి మాట్లాడిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ పేర్కొన్నారు. ‘యోగి హయాంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. యూపీ ప్రభుత్వం మహిళలపై నేరాలకు పాల్పడుతున్న వారిని రక్షించి, సమర్థిస్తున్న వైఖరే నిందితులకు ధైర్యంగా మారుతోంది’అని ఆరోపించారు. యూపీలోని గోండా జిల్లాలో ఇంటి కప్పుపై నిద్రిస్తున్న ముగ్గురు బాలికలపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరికి స్పల్పంగా కాలిన గాయాలయ్యాయి. ఒకరికి ముఖంపై తీవ్ర గాయాలు కావడంలో పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు ముగ్గురూ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శైలేష్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.