Magunta Sreenivasulu Reddy: త్వరలో తెదేపాలో చేరతా: ఎంపీ మాగుంట

త్వరలో తెదేపాలో చేరతానని వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Sreenivasulu Reddy) ప్రకటించారు.

Updated : 11 Mar 2024 18:57 IST

ఒంగోలు: త్వరలో తెదేపాలో చేరతానని వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (Magunta Sreenivasulu Reddy) ప్రకటించారు. తన కుమారుడు రాఘవరెడ్డి కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌తో చర్చించి చేరిక తేదీని నిర్ణయిస్తామన్నారు. ఒంగోలులో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు చంద్రబాబుతో చెప్పానన్నారు. రానున్న ఎన్నికల్లో తెదేపా నుంచి తన కుమారుడు పోటీ చేస్తారని శ్రీనివాసులురెడ్డి తెలిపారు. తెదేపా-జనసేన-భాజపా కలిసి పనిచేయడం శుభపరిణామమని చెప్పారు. వైకాపాకు మాగుంట ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని