Ajit Pawar: ఎమ్మెల్యేలందరూ నాతోనే.. ఎన్సీపీ గుర్తుపైనే ఎన్నికల్లో పోటీ..!
ఎమ్మెల్యేలందరూ తనతోనే ఉన్నారని, భవిష్యత్తులో ఎన్సీపీ గుర్తుపైనే ఎన్నికల్లో పోటీ చేస్తామని అజిత్ పవార్ తెలిపారు. అయితే, ఈ ఆటలు ఎక్కువ కాలం సాగవని శివసేన (యూబీటీ) వర్గం నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
ముంబయి: ఎన్సీపీ (NCP) ఎమ్మెల్యేలందరూ తనతోనే ఉన్నారని, ఒక పార్టీగానే ఏక్నాథ్ శిందే (Eknath Shinde) ప్రభుత్వానికి మద్దతు పలికినట్లు మహారాష్ట్ర (Maharashtra) ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) వెల్లడించారు. భవిష్యత్తులో పార్టీ గుర్తు (NCP Symbol)పైనే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం అజిత్ మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతో అధికార పక్షంలో చేరినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన (Shivsena)తో కలిసి వెళ్లగలిగితే.. భాజపా (BJP)తో ఎందుకు వెళ్లకూడదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. రానున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేస్తామన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవికి శుక్రవారమే రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
మరోవైపు.. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందించారు. ఈ ఆటలు ఎక్కువ కాలం సాగవని పేర్కొన్నారు. ఇలా జరుగుతుందని ముందే తెలుసని చెప్పారు. ‘‘రాష్ట్రంలో రాజకీయాలను నాశనం చేసేందుకు కొంతమంది కంకణం కట్టుకున్నారు. వారు తమ పనిని కొనసాగించొచ్చు. ఇప్పుడే శరద్ పవార్తో మాట్లాడా. ‘నేను దృఢంగా ఉన్నా. మనకు ప్రజామద్దతు ఉంది. మళ్లీ ప్రతిదీ పునర్నిర్మించుకుందాం’ అని ఆయన చెప్పారు. పైగా.. ప్రజలు ఈ ఆటలను ఎక్కువ కాలం సహించరు’’ అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ఎవరినైతే జైలుకు పంపించేందుకు భాజపా సిద్ధమైందో.. ఆయన నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని అజిత్ పవార్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. త్వరలోనే ఏక్నాథ్ శిందేతోపాటు ఆయనతో వెళ్లిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, కొన్ని రోజుల్లో రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రి వస్తారని తెలిపారు.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ పలువురు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం ఏర్పాటు చేయడం, అనంతరం సీఎం ఏక్నాథ్ శిందేను కలవడం, ఆ వెంటనే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఇప్పటికే శిందే వర్గం చీలిక పరిణామాలతో దెబ్బతిన్న మహావికాస్ అఘాడీకి అజిత్ తాజా నిర్ణయంతో మరో షాక్ తగిలినట్లయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!