Nyay Yatra: ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా కుట్ర: రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ శుక్రవారం ఝార్ఖండ్లోకి ప్రవేశించింది. ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా యత్నించిందని ఆయన ఆరోపించారు.
రాంచీ: ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా యత్నించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. అయితే, ఆ పార్టీ కుట్రలకు ‘ఇండియా’ కూటమి ఎదురొడ్డి నిలిచిందని పేర్కొన్నారు. మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) అరెస్టుతో ఝార్ఖండ్లో రాజకీయ సంక్షోభం నెలకొన్న తరుణంలో రాహుల్ ఆధ్వర్యంలోని ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’ శుక్రవారం పశ్చిమ బెంగాల్ నుంచి ఝార్ఖండ్లోకి ప్రవేశించింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ ఆయనకు స్వాగతం పలికారు. పాకుడ్ పట్టణంలో నిర్వహించిన సభలో రాహుల్ ప్రసంగించారు.
అలాంటి వారు పార్టీని వీడటం మంచిదే: రాహుల్ గాంధీ
‘‘భాజపాకు ధన బలం, దర్యాప్తు సంస్థల అండ ఉంది. నేను, నా పార్టీ మాత్రం వాటికి భయపడలేదు. విభజనవాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం. దేశంలో అన్యాయం రాజ్యమేలుతోంది. అధిక ధరలు సామాన్యుడి నడ్డివిరుస్తున్నాయి. నిరుద్యోగ సమస్య వేధిస్తోంది. దేశంలో ఉపాధి కల్పనకు వెన్నెముకగా నిలిచిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల వినాశనానికి మోదీ సర్కారు చేసిన నోట్ల రద్దు, జీఎస్టీలే కారణం’’ అని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. రైతులు, యువత, అణగారిన వర్గాలకు ఆర్థిక, సామాజిక న్యాయం కోసమే ఈ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. న్యాయ్ యాత్రకు పూర్తి మద్దతిస్తామని సీఎం చంపయీ సోరెన్ హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్