YS Sharmila: తెరాస కొనడం.. కాంగ్రెస్‌ అమ్ముడుపోవడం పరిపాటి: షర్మిల

తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు మహిళలంటే గౌరవం లేదని వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

Published : 08 May 2022 16:20 IST

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు మహిళలంటే గౌరవం లేదని వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. కేసీఆర్‌ తన పార్టీ నిధుల నుంచి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఫాంహౌస్‌ నుంచి కేసీఆర్‌ బయటకు రావాలన్నారు. కేసీఆర్‌ రాజులా.. కేటీఆర్‌ యువరాజులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గవర్నర్‌కు కూడా తెరాస కనీస మర్యాద ఇవ్వడం లేదని షర్మిల ఆరోపించారు. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆమె ప్రశ్నించారు.

రైతులకు మేలు చేయాలనే ఆలోచన కాంగ్రెస్‌కు లేదని షర్మిల ఆరోపించారు. తెరాస కొనడం.. కాంగ్రెస్‌ నేతలు అమ్ముడుపోవడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వ్యక్తికి పగ్గాలిస్తే నేతలు అమ్ముడుపోతారని షర్మిల వ్యాఖ్యానించారు. తెరాసతో పొత్తు ఉండదని చెప్పారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. తమ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని ఆమె వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని