ఒకవేళ ధోనీ ఐపీఎల్లో సరిగ్గా ఆడకపోతే..?
లాక్డౌన్ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ పడమూడో సీజన్పై స్పష్టత రావడంతో అందరి కళ్లూ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీపై...
మాజీ సారథిపై డీన్జోన్స్ ఏమన్నాడంటే..
ఇంటర్నెట్డెస్క్: లాక్డౌన్ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ 13వ సీజన్పై స్పష్టత రావడంతో అందరి కళ్లూ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీపై పడ్డాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8వరకు ఆ మెగా ఈవెంట్ను యూఏఈలో నిర్వహిస్తున్నట్లు గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ శుక్రవారం మీడియాకు తెలిపారు. మరోవైపు గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్కు దూరమైన ధోనీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ఐపీఎల్లో రాణించి మళ్లీ జాతీయ జట్టులోకి వస్తాడని ఆశగా వేచి చూస్తున్నారు. ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్జోన్స్ స్పందించారు.
‘ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ సెలక్టర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ ధోనీ ఈ ఐపీఎల్లో చెలరేగితే అతడి పునరాగమనానికి అవకాశాలు ఉన్నాయి. కానీ, అతడు విఫలమైతే మాత్రం కచ్చితంగా టీమ్ఇండియా తలుపులు మూసుకుపోతాయి. ఇప్పటికైతే మహీకి అవకాశం ఉంది. ఈ విరామం కూడా అతడికి అద్భుతంగా కలిసిరావొచ్చు. దీంతో మంచి విశ్రాంతి దొరికింది. అయితే, ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. వయసు పెరిగే కొద్దీ ఒక ఆటగాడు విరామం తీసుకొని మళ్లీ రాణించడం చాలా కష్టం’ అని జోన్స్ పేర్కొన్నారు. అలాగే ధోనీ ఒక సూపర్స్టార్ అని, అతడో గొప్ప ఆటగాడని మెచ్చుకున్నాడు. అయితే, ఇప్పుడు మాత్రం టీమ్ఇండియా.. పంత్, రాహుల్ వైపే చూస్తుందని చెప్పాడు. ఇకపోతే భారత జట్టుకు అసలైన సమస్య మంచి ఫినిషర్ లేకపోవడమేనని స్పష్టంచేశాడు. ఆ విషయంలో హార్దిక్ పాండ్యను తీసుకుంటే అతడే సరిపోతాడని జోన్స్ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉండగా, ఏడాది పాటు ఆటకు దూరమైన ధోనీ మార్చిలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన శిక్షణా శిబిరంలో సాధన చేశాడు. అక్కడ ఎంతో కష్టపడ్డాడని తోటి ఆటగాళ్లు, ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ఇప్పుడు ఐపీఎల్ తేదీలు ఖరారవడంతో ఈసారి అతడు చెలరేగిపోతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్