..తప్పులు చేసేలా భారత బౌలింగ్‌

ఎంసీజీ పిచ్‌లో ఎలాంటి లోపాలు లేవని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. ఆతిథ్య జట్టు బ్యాటింగ్ మాత్రం అత్యంత‌ పేలవంగా ఉందన్నాడు. రెండో టెస్టులో టీమ్‌ఇండియా బౌలింగ్‌లో చెత్త షాట్లు ఆడారని విమర్శించాడు. మూడో రోజు ఆట ముగిశాక పాంటింగ్‌ మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం ఈ పోరులో ఆసీస్‌ ఓటమివైపు పయనిస్తున్న సంగతి తెలిసిందే...

Published : 29 Dec 2020 01:26 IST

అందుకే ఆసీస్‌ విఫలమైందన్న రికీ పాంటింగ్‌

మెల్‌బోర్న్‌: ఎంసీజీ పిచ్‌లో ఎలాంటి లోపాలూ లేవని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. ఆతిథ్య జట్టు బ్యాటింగ్ మాత్రం అత్యంత‌ పేలవంగా ఉందన్నాడు. రెండో టెస్టులో టీమ్‌ఇండియా బౌలింగ్‌లో చెత్త షాట్లు ఆడారని విమర్శించాడు. మూడో రోజు ఆట ముగిశాక పాంటింగ్‌ మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం ఈ పోరులో ఆసీస్‌ ఓటమివైపు పయనిస్తున్న సంగతి తెలిసిందే.

‘పిచ్‌ను నిందించొద్దు. మూడో రోజు పిచ్‌ చాలా బాగుంది. బంతి కాస్త టర్న్‌ అవుతోంది. కానీ అది ఊహించతగిందే. ఎందుకంటే టెస్టులో మూడో రోజు ఇది. ఫాస్ట్‌ బౌలర్లకు కొంతే సహకరించింది. ఏదేమైనప్పటికీ ఆసీస్‌ది పేలవ బ్యాటింగే’ అని పాంటింగ్‌ అన్నాడు. టీమ్‌ఇండియా బౌలింగ్‌లో దూకుడుగా ఆడేందుకు ఆసీస్‌ బ్యాటర్లు ఉత్సాహం చూపలేదని రికీ విమర్శించాడు. ‘బ్యాట్స్‌మెన్‌ వికెట్లు ఇవ్వడానికి కారణమిదే. చెత్త షాట్లు ఆడారు. క్రమం తప్పకుండా పరుగులు చేయలేదు. దాంతో ఒత్తిడి పెరిగింది. ఒత్తిడి పెరిగిందంటే చెత్త షాట్లే కదా ఆడతారు’ అని అతడు పేర్కొన్నాడు.

‘రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఆడిన విధానం గురించి తొలి ఇన్నింగ్స్‌లోనూ నేను మాట్లాడాను. అతడిపై దూకుడుగా ఆడలేదు. నిజానికి అతడు అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కానీ కొన్నిసార్లు అత్యుత్తమ బౌలర్ల బౌలింగ్‌లోనూ రిస్క్‌ చేయాలి. భారత బౌలర్లు చెత్త బంతులు వేయలేదు. బుమ్రా, అశ్విన్‌, సిరాజ్‌, జడేజా పొరపాట్లు చేయలేదు. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ తప్పులు చేసేలా వారు బంతులు విసిరారు. నిజానికి మంచి బౌలర్లు తప్పులు చేసేలా బ్యాట్స్‌మెన్‌ దాడి చేయాలి’ అని  పాంటింగ్‌ అన్నాడు.

ఇవీ చదవండి
ధోనీకి అవార్డు తెచ్చిన సంఘటన ఇదే!
కోహ్లీ, ధోనీకి ప్రతిష్ఠాత్మక అవార్డులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని