మళ్లీ ముంబయి ఇండియన్స్కు పార్థివ్
టీమ్ఇండియా మాజీ వికెట్కీపర్ బ్యాట్స్మన్ పార్థివ్ పటేల్ మళ్లీ ముంబయి ఇండియన్స్లో చేరాడు. అయితే ఆటగాడిగా కాదండోయ్! ఆ జట్టు ప్రతిభాన్వేషకుడిగా ఎంపికయ్యాడు. భారత జట్టు తరఫున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడిన పార్థివ్ బుధవారమే అన్ని...
ఈ సారి ప్రతిభాన్వేషకుడిగా చేరిక
ముంబయి: టీమ్ఇండియా మాజీ వికెట్కీపర్ బ్యాట్స్మన్ పార్థివ్ పటేల్ మళ్లీ ముంబయి ఇండియన్స్లో చేరాడు. అయితే ఆటగాడిగా కాదండోయ్! ఆ జట్టు ప్రతిభాన్వేషకుడిగా. భారత జట్టు తరఫున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడిన పార్థివ్ బుధవారమే అన్ని ఫార్మాట్లలో వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
‘దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్లో పార్థివ్కు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ఐపీఎల్లో వేగంగా పెరుగుతున్న పోటీని అతడు అర్థం చేసుకోగలడు’ అని ముంబయి ఓ ప్రకటనలో తెలిపింది. మళ్లీ తమ బృందంలో చేరినందుకు ఆ ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ అభినందనలు తెలియజేశాడు.
‘ముంబయి ఇండియన్స్కు ఆడుతున్నప్పటి నుంచి మాకు అతడి తెలివితేటలు తెలుసు. అతడికున్న క్రికెట్ విజ్ఞానంతో మా ప్రతిభాన్వేషణ వ్యవస్థకు తోడ్పడగలడని మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మా ఆలోచనా విధానం పార్థివ్ అర్థం చేసుకుంటాడు. ముంబయిలో మేం ఏం చేయాలనుకుంటున్నామో అతడికి తెలుసు’ అని అంబానీ అన్నారు.
తనకు మరో అవకాశం ఇచ్చిన ముంబయికి పార్థివ్ కృతజ్ఞతలు ప్రకటించాడు. ‘ముంబయి ఇండియన్స్కు ఆడుతూ నా క్రికెట్ను ఎంతో ఆస్వాదించాను. మూడు సార్లు ట్రోఫీలు అందుకోవడం నాకు మరుపురాని గుర్తులు. ఇప్పుడు నా జీవితలో సరికొత్త అధ్యాయానికి సమయం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ముంబయికి ధన్యవాదాలు’ అని అన్నాడు. ఇకపై ప్రతిభాన్వేషణలో కోచింగ్ బృందానికి సాయంగా ఉండనున్నాడు.
ఇవీ చదవండి
‘కింగ్కోహ్లీ’.. భూమ్మీద బిజీ క్రికెటర్!
నెట్బౌలర్ నుంచి టీమ్ఇండియా పేసర్గా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్