రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా‌ 65/2

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లకు 65/2 పరుగులతో కొనసాగుతోంది. రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి మాథ్యూవేడ్‌(27), స్టీవ్‌స్మిత్‌(6) క్రీజులో ఉన్నారు...

Updated : 28 Dec 2020 09:58 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లకు 65/2 పరుగులతో కొనసాగుతోంది. రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి మాథ్యూవేడ్‌(27), స్టీవ్‌స్మిత్‌(6) క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు ఉమేశ్‌, అశ్విన్‌ చెరో వికెట్‌ తీశారు. ఆస్ట్రేలియా ఇంకా 66 పరుగుల వెనుకంజలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆదిలోనే కంగారూల ఓపెనర్‌ జో బర్న్స్‌(4) ఔటయ్యాడు. ఉమేశ్‌ బౌలింగ్‌లో అతడు కీపర్‌ పంత్‌ చేతికి చిక్కాడు. ఆపై మార్నస్‌ లబుషేన్‌(27)ను అశ్విన్‌ బోల్తా కొట్టించాడు. దీంతో ఆ జట్టు 42 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. వేడ్‌, స్మిత్‌ ఇప్పటివరకు 23 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు టీమ్‌ఇండియా 326 పరుగులకు ఆలౌటైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని