నీతో కలిసి పనిచేయడమే నాకో గౌరవం
ఎంఎస్ ధోనీతో కలిసి పనిచేయడం అత్యుత్తమ గౌరవంగా భావిస్తున్నానని టీమ్ఇండియా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టన్ అన్నారు. జట్టుతో కలిసి ఎన్నో మధురస్మృతులు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోని మేటి సారథుల్లో మహీ ఒకరిని ప్రశంసించారు...
మహీని ప్రశంసించిన మాజీ కోచ్ గ్యారీ కిర్స్టన్
ఇంటర్నెట్ డెస్క్: ఎంఎస్ ధోనీతో కలిసి పనిచేయడం అత్యుత్తమ గౌరవంగా భావిస్తున్నానని టీమ్ఇండియా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టన్ అన్నారు. జట్టుతో కలిసి ఎన్నో మధురస్మృతులు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోని మేటి సారథుల్లో మహీ ఒకరిని ప్రశంసించారు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ సెమీస్ తర్వాత జట్టుకు దూరమైన ఎంఎస్ ధోనీ శనివారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టెస్టులకు వీడ్కోలు పలికినప్పటి నుంచే అతడు దేశవాళీ క్రికెట్ ఆడటం లేదు. ఇకపై కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనే అభిమానులను అలరించనున్నాడు. కరోనా వైరస్ ముప్పుతో మార్చిలో జరగాల్సిన ఐపీఎల్-2020 సెప్టెంబర్ 19న మొదలవుతోంది. అయితే పొట్టి క్రికెట్ వేడుకకు యూఏఈ ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే చెపాక్కు చేరుకున్న మహీ జట్టు సభ్యులతో కలిసి ఆగస్టు 20 తర్వాత ప్రత్యేక విమానంలో దుబాయ్ చేరుకోనున్నాడు. వీడ్కోలు తర్వాత అతడెలా ఆడతాడో అన్న ఆసక్తి నెలకొంది.
‘ప్రపంచంలోనే అత్యుత్తమ సారథుల్లో ఒకరైన ధోనీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవం. టీమ్ఇండియాతో కలిసి నాకు మధుర స్మృతులు అందించిన మహీకి కృతజ్ఞతలు’ అని కిర్స్టన్ ట్వీట్ చేశాడు. మూడు చిత్రాలను పోస్ట్ చేశాడు. అందులో ఒకచిత్రంపై ‘ఎంఎస్ ధోనీతో కలిసి యుద్ధానికైనా వెళ్తాను’ అని రాసుండటం గమనార్హం. మహీ, కిర్స్టన్ కలయికలో భారత జట్టు అద్భుత విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. 2010లో ఆసియా కప్ గెలించింది. 2011లో భారతీయులు ఏళ్లుగా ఎదురు చూస్తున్న రెండో ప్రపంచకప్ కల నెరవేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..