ముందు నుంచే ప్రాక్టీస్ చేశాం: వెంకటేశ్ ప్రసాద్
టీమ్ఇండియా మాజీ పేసర్, బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్ ఇటీవల రవిచంద్రన్ అశ్విన్తో ‘డీఆర్ఎస్ విత్ ఆశ్’ అనే కార్యక్రమంలో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన సంగతి...
బ్యాట్స్మన్ కూడా ఆసక్తి చూపించారు
2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా బౌలౌట్పై వివరణ..
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ పేసర్, బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్ ఇటీవల రవిచంద్రన్ అశ్విన్తో ‘డీఆర్ఎస్ విత్ ఆశ్’ అనే కార్యక్రమంలో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వెంకటేశ్ 1996 ప్రపంచకప్లో పాకిస్థాన్ బ్యాట్స్మన్ ఆమిర్ సోహేల్ను ఔట్ చేసిన విధానం నుంచీ భారత జట్టుకు బౌలింగ్ కోచ్గా తాను ఎదిగిన తీరును వివరించాడు. ఆ క్రమంలోనే 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా పాక్తో లీగ్ స్టేజ్లో తలపడిన ఓ మ్యాచ్ గురించి స్పందించాడు. ఆ మ్యాచ్ టైగా మారడంతో బౌలౌట్ విధానంలో టీమ్ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరు జట్లూ నిర్ణీత 20 ఓవర్లలో చెరో 141 పరుగులు చేయగా, మ్యాచ్ టైగా మారి ఫలితం కోసం బౌలౌట్ విధానానికి వెళ్లింది. అప్పుడు టీమ్ఇండియా సెహ్వాగ్, రాబిన్ ఉతప్ప, హర్భజన్ సింగ్తో బౌలింగ్ చేయించి మూడుసార్లు వికెట్లను పడగొట్టింది. పాక్ బౌలర్లు ఒక్కరు కూడా వికెట్లు పడగొట్టకపోవడంతో ధోనీసేన 3-0తో గెలుపొందింది.
ఇదే విషయంపై అశ్విన్ వెంకటేశ్ ప్రసాద్ను ప్రశ్నించాడు. బౌలౌట్ విధానంలో రెగ్యులర్ బౌలర్లను కాకుండా సెహ్వాగ్, ఉతప్పలను ఎంచుకోవడం ఏంటని అడిగాడు. దానికి స్పందించిన మాజీ పేసర్. అప్పుడు ఏం జరిగిందనే విషయంపై స్పష్టతనిచ్చాడు. ఆ టోర్నీలో నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకున్నామని, తద్వారా ఏదైన మ్యాచ్ టైగా మారితే బౌలౌట్ విధానం అమలు చేస్తారని తెలిసిందని చెప్పాడు. అయితే, అంతకన్నా ముందే టీమ్ఇండియా ఆ బౌలౌట్ పద్ధతిని ప్రాక్టీస్ చేసేదని వెంకటేశ్ అన్నాడు. అప్పుడు చాలా మంది బ్యాట్స్మన్ కూడా బౌలింగ్ చేయడానికి ఆసక్తి చూపించారని, అందులో ధోనీ, సెహ్వాగ్, ఉతప్ప లాంటి బ్యాట్స్మన్ ఉన్నారన్నాడు. అలా తాను వెనుక నుంచి ఎవరు నిలకడగా వికెట్లకు నేరుగా విసురుతున్నారో గమనించేవాడినని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే తాను సెహ్వాగ్, ఉతప్ప, భజ్జీ నిలకడగా వికెట్లకు తాకేలా బంతులేస్తున్నారని గ్రహించి ఆ విషయాన్ని ధోనీకి చెప్పినట్లు మాజీ కోచ్ పేర్కొన్నాడు. ఆ విషయంలో ధోనీని ఒప్పించడం తనకు పెద్ద ఇబ్బంది కాలేదన్నాడు. చివరికి ధైర్యం చేసి వారినే పాకిస్థాన్పై బౌలౌట్కు పంపామని వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM