Ashwin on Bumrah: టెస్టుల్లో బుమ్రా నం.1.. నేను అతడికి పెద్ద అభిమానిని: అశ్విన్
భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటాడు. తాజాగా పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah) టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు వరకు రవిచంద్రన్ అశ్విన్దే (Ravichandran Ashwin) ఆ స్థానం. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో (IND vs ENG) బుమ్రా ఏకంగా 9 వికెట్లు తీసి భారత్ను గెలిపించాడు. దీంతో అతడు ర్యాంకింగ్స్లో పైకి వచ్చేయగా.. అశ్విన్ మూడో స్థానానికి పడిపోయాడు. ఈ క్రమంలో బుమ్రా ర్యాంకు, గిల్ సెంచరీ, అండర్-19 వరల్డ్ కప్లో భారత కెప్టెన్ ఉదయ్ సహరన్పై అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో బూమ్బాల్ చూశాం. అద్భుతంగా బౌలింగ్ వేశాడు. కేవలం రెండు టెస్టుల్లోనే 14 వికెట్లు తీశాడు. దీంతో ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరాడు. నేను అతడికి అతిపెద్ద ఫ్యాన్ని. హిమాలయమంత ఘనతను సాధించాడు. ఇంగ్లాండ్పై రెండో టెస్టులో సెంచరీ చేసిన గిల్ మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. అతడు చాలా ప్రతిభావంతుడు. ఇటీవల నాలుగు రోజుల్లోపే టెస్టు మ్యాచ్లు ముగుస్తున్నాయి. అయితే, నాణ్యమైన ప్రదర్శనతోపాటు ఇరు జట్లూ పోటీపడటం వల్ల ఫలితం త్వరగానే వచ్చేస్తోంది. ఇప్పుడు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో 1-1తో సమంగా నిలిచాం. ఆసీస్-ఇంగ్లాండ్ మధ్య 2005లో జరిగిన యాషెస్ సిరీస్ చూశా. ఇప్పుడు ఇంగ్లాండ్తో ఆడుతుంటే నాకు అదే గుర్తుకొస్తోంది. రాజ్కోట్ వేదికగా మూడో టెస్టు ఆడనున్నాం. పుజారా ఏమైనా డిన్నర్కు ఆహ్వానిస్తాడేమో చూడాలి. రవీంద్ర జడేజాది కూడా సొంతమైదానమే. కానీ, జడ్డూ జామ్నగర్లో ఉంటాడు’’ అని అశ్విన్ తెలిపాడు.
రింకు సింగ్తో ఉదయ్ సహరన్కు పోలిక
‘‘అభిమానులు కెప్టెన్ ఉదయ్ సహరన్ను రింకు సింగ్తో పోలుస్తూ ఉంటారు. అండర్ 19 వరల్డ్ కప్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్. మ్యాచ్లను గెలిపించడంలోనూ ముందున్నాడు. సెమీస్లో ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. రింకు సింగ్ కూడా లోయర్ ఆర్డర్లో అదరగొట్టాడు. ఇలాంటి టాలెంట్ను డబ్బుతో కొనలేం. అతడి ఆటపై ఉదయ్కు పూర్తి నమ్మకం ఉంది. వీరిద్దరూ ఎంతో ప్రశాంతంగా ఆడేస్తారు’’ అని భారత సీనియర్ స్పిన్నర్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
-
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!
-
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య