Ashwin- Dravid: వెయిటర్తో ద్రవిడ్ గంటపాటు చర్చ.. ఎందుకంటే..!
భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు (Rahul Dravid) ఆటపై ఉన్న ఆసక్తి, అభిరుచి ఏ స్థాయిలో ఉంటుందో రవిచంద్రన్ అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. ఎవరితోనైనా కలిసిపోయి క్రికెట్ గురించి చర్చిస్తాడనేందుకు ఇదొక ఉదాహరణగా పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్లో (Ashes Series) భాగంగా ఇంగ్లాండ్ - ఆసీస్ (ENG vs AUS) మధ్య మూడు టెస్టులు ముగియగా.. నాలుగో మ్యాచ్ జులై 19 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే, ఇప్పటికీ జానీ బెయిర్స్టో ఔట్ వివాదం కొనసాగుతూనే ఉంది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కొందరు వాదిస్తుండగా.. మరి కొందరు నిబంధనల ప్రకారం సక్రమమే అంటూ మద్దతుగా నిలిచే వారూ ఉన్నారు. ఈ క్రమంలో భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీని అభినందించాడు. తాజాగా ఇదే విషయంపై రాహుల్ ద్రవిడ్ - ఓ వెయిటర్కు మధ్య జరిగిన సంభాషణను అశ్విన్ వెల్లడించాడు.
‘‘ఓ రోజు మేం బీచ్లో కూర్చొని ఉన్నాం. రాహుల్ భాయ్ నాకొక లెమన్ జ్యూస్ తెప్పించారు. దాదాపు ఒక గంటపాటు బెయిర్స్టో ఔట్పై సర్వర్, వెయిటర్తో ద్రవిడ్ చర్చించాడు. నిబంధనల గురించి మాట్లాడుకున్నారు. క్రీడా స్ఫూర్తి వంటి అంశాలపై చర్చించారు. ఇలాగే గంటపాటు సంభాషణ కొనసాగింది. వారికి క్రికెట్పై ఉన్న మక్కువ చూసిన తర్వాత ఆశ్చర్యమేసింది. ఇంతలో ఓ పెద్దాయన వచ్చి ‘ఆ బెయిర్స్టో ఔటేనండి ’ అంటూ అతడి యాసలో చెప్పేయడంతో చర్చ ముగిసింది’’ అని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.
టీమ్ఇండియా ఆటగాళ్లు వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడేందుకు భారత్ ఇక్కడికి వచ్చింది. ప్రస్తుతం డొమినికా వేదికగా మొదటి టెస్టు తొలి రోజు ఆట కూడా ముగిసింది. విండీస్ తమ మొదటి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ 80/0 స్కోరుతో కొనసాగుతోంది. క్రీజ్లో యశస్వి (40*), రోహిత్ (30*) ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా