WI vs IND: అశ్విన్ జోరు.. విండీస్ విలవిల.. తొలిరోజు భారత్దే ఆధిపత్యం
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. తొలుత విండీస్ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. బ్యాటింగ్లోనూ ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది.
డొమినికా: వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా (Team India)కు అదిరే ఆరంభం లభించింది. తొలుత విండీస్ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. బ్యాటింగ్లోనూ ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (30), యశస్వి జైస్వాల్ (40) పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 70 పరుగుల వెనుకంజలో ఉంది. విండీస్ ప్లేయర్లలో అరంగేట్ర ఆటగాడు అథనేజ్ (47) మినహా మిగతావారు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. బ్రాత్ వైట్ (20), జేసన్ హోల్డర్ (18), బ్లాక్ వుడ్ (14), త్యాగ్నారాయణ్ చందర్ పాల్ (12), రఖీమ్ కార్నివాల్ (19*) పరుగులు చేశారు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో ఐదు వికెట్లు పడగొట్టి విండీస్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. జడేజా 3, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 10 ఓవర్లకు 29/0తో నిలవడంతో మంచి స్కోరే చేసేలా కనిపించింది. కానీ, నిలకడగా ఆడుతున్న త్యాగ్నారాయణ్ చందర్పాల్ (12)ను అశ్విన్ క్లీన్బౌల్డ్ చేసి విండీస్ పతనానికి నాంది పలికాడు. తర్వాత విండీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. బ్రాత్వైట్ (20).. అశ్విన్ బౌలింగ్లో రోహిత్ శర్మకు చిక్కాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 20వ ఓవర్లో రీఫర్ (2) వికెట్ కీపర్ ఇషాన్కు క్యాచ్ ఇచ్చాడు. లంచ్ బ్రేక్కు ముందు బ్లాక్వుడ్(14) జడేజా బౌలింగ్లో ఔటయ్యాడు. మహ్మద్ సిరాజ్ గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో బ్లాక్వుడ్ పెవిలియన్ బాటపట్టాడు.
తొలి సెషన్లో 68/4తో నిలిచిన విండీస్.. రెండో సెషన్లోనూ పోరాడలేకపోయింది. జడేజా వేసిన 32 ఓవర్లో జోష్వా ద సిల్వా (2) వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో అథనేజ్, జేసన్ హోల్డర్ నిలకడగా ఆడటంతో స్కోరు 100 దాటింది. అయితే భాగస్వామ్యం బలపడుతున్న దశలో హోల్డర్ను సిరాజ్ ఔట్ చేశాడు. కాసేపటికే అల్జారి జోసెఫ్ (4)తో పాటు అథనేజ్లను అశ్విన్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. దీంతో టీ విరామ సమయానికి విండీస్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. చివరి సెషన్లో కీమర్ రోచ్ (1) జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగ్గా.. వారికన్ (0)ను అశ్విన్ ఔట్ చేయడంతో విండీస్ ఆలౌటైంది.
తండ్రీకొడుకులిద్దరినీ..: భారత సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో తండ్రీకొడుకులిద్దరినీ ఔట్ చేసిన అయిదో బౌలర్గా నిలిచాడు. విండీస్తో తొలి టెస్టు తొలి రోజు త్యాగ్నారాయణ్ చందర్పాల్ను బౌల్డ్ చేయడంతో అతడికీ ఈ ఘనత దక్కింది. 2011లో దిల్లీలో అరంగేట్రం చేసిన అశ్విన్.. ఆ మ్యాచ్లో త్యాగ్నారాయణ్ తండ్రి శివ్నారాయణ్ చందర్పాల్ను ఔట్ చేశాడు. అప్పుడు చందర్పాల్ను అతడు ఎల్బీగా వెనక్కి పంపాడు. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), సిమోన్ హార్మర్ (దక్షిణాఫ్రికా) కూడా త్యాగ్నారాయణ్, శివ్నారాయణ్లను ఔట్ చేశారు.
అశ్విన్ @ 700
అశ్విన్ 700వ అంతర్జాతీయ వికెట్ సాధించాడు. బుధవారం అల్జారి జోసెఫ్ను ఔట్ చేసి అతనీ ఘనతను అందుకున్నాడు. భారత్ నుంచి ఇప్పటిదాకా అనిల్ కుంబ్లే (953), హర్భజన్ సింగ్ (707) మాత్రమే ఈ క్లబ్లో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
ఐపీఎల్ చివరి దశకు వరుణుడు అడ్డుగా మారాడు. కీలకమైన సమయంలో మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నాడు. -
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా నాణ్యమైన క్రికెట్ను ఆడటంలో విఫలమైనట్లు ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశాడు. లఖ్నవూ చేతిలో ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. -
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 214 పరుగులు చేయగా.. ముంబయి 196 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. చివరి మ్యాచ్లో ముంబయిని ఓడించినప్పటికీ లఖ్నవూ ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
లఖ్నవూతో మ్యాచ్ సందర్భంగా ముంబయి స్టార్ రోహిత్ శర్మ చేసిన ఓ విజ్ఞప్తి నెట్టింట వైరల్గా మారిపోయింది. -
పూరన్ దంచెన్
ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్ సీజన్ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. -
వానా వానా వద్దప్పా!
అసలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..! -
సెమీస్లో సాత్విక్ జోడీ
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
అప్పటి నుంచే ఆ ఆలోచన
అఫ్గానిస్థాన్తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం తొలిసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్ సునీల్ ఛెత్రి చెప్పాడు. -
ఆర్జనలో రొనాల్డో నం.1
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. -
మను బాకర్ జోరు
ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్లో భారత అగ్రశ్రేణి షూటర్ మను బాకర్ జోరు కొనసాగుతోంది. -
పర్వీన్పై నిషేధం.. చేజారిన ఒలింపిక్ బెర్తు
బాక్సింగ్లో భారత్ ఓ ఒలింపిక్ బెర్తు కోల్పోయింది. -
నా రికార్డులు ప్రస్తుతానికి భద్రమే
తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. -
ట్రయల్స్ వద్దు.. పారిస్కు పంపండి
సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు. -
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
ఐపీఎల్ 2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?