AUS vs SL: ఆసీస్ బోణీ.. శ్రీలంకపై ఘన విజయం
వన్డే ప్రపంచకప్లో ఆసీస్ బోణీ కొట్టింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో ఆసీస్ బోణీ కొట్టింది. లఖ్నవూ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్లోనూ తనదైన ప్రదర్శనతో ఆకట్టుకొని 210 పరుగుల లక్ష్యాన్ని 35.2 ఓవర్లలో ఛేదించింది. మిచెల్ ఓపెనర్ మిచెల్ మార్ష్ (52; 51 బంతుల్లో 9×4), జోష్ ఇంగ్లిష్ (58; 59 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. మార్నస్ లబుషేన్ (40), మాక్స్వెల్ (31*) రాణించారు. స్టాయినిస్ (20*; 10 బంతుల్లో 2×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో మధుశనక మూడు వికెట్లు పడగొట్టగా, దునిత్ ఒక వికెట్ తీశాడు.
వారిద్దరూ నిరాశపరిచినా..
లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మధుశనక వేసిన 3.1వ బంతికి డేవిడ్ వార్నర్ (11) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అదే ఓవర్ చివరి బంతికి తొలి డౌన్లో వచ్చిన స్టీవెన్ స్మిత్ (0) కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఒకే ఓవర్లో 2 కీలక వికెట్లు కోల్పోవడంతో జట్టు ఒక్కసారిగా కష్టాల్లోకి జారుకుంది. కానీ, రెండో డౌన్లో వచ్చిన లబుషేన్తో కలిసి మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ క్రీజులో నిలదొక్కుకుంటూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, జట్టు స్కోరు 81 పరుగుల వద్ద మిచెల్ మార్ష్ రనౌట్గా వెనుదిరిగాడు.
జోష్ ఇంగ్లిష్ ‘జోష్’
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోష్ ఇంగ్లిష్ మరింత దూకుడుగా ఆడాడు. వచ్చీ రాగానే వరుసగా రెండు బౌండరీలు బాది.. శ్రీలంక బౌలర్లలో భయం పుట్టించారు. అదే జోరును కొనసాగిస్తూ.. 47 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని మళ్లీ మధుశనకే విడగొట్టాడు. 40పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లబుషేన్ భారీషాట్కు ప్రయత్నించి కరుణరత్నేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే ఇంగ్లిష్ కూడా దునిత్ వెల్లలాగే బౌలింగ్లో క్యాచ్ ఔట్గా పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్ (31*), స్టాయినిస్ (20*) లక్ష్యాన్ని పూర్తి చేశారు.
అంతకుముందు టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు 209 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (61), కుశాల్ పెరీరా (78) తప్ప ఇంకెవరూ రాణించలేదు. చరిత్ అసలంక (25) ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ కుశాల్ మెండిస్(9), సదీర సమరవిక్రమ (8), ధనంజయ డిసిల్వా (7), దునిత్ వెల్లలాగే (2), చమిక కరుణరత్నే (2), మహీశ్ తీక్షణ (0), లాహిరు కుమార (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లతో రాణించాడు. పాట్ కమిన్, మిచెల్ స్టార్క్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, గ్లెన్ మ్యాక్స్వెల్ ఒక వికెట్ తీశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా