Rahul Dravid: అవును.. వన్డే జట్టులో సమతౌల్యం లోపించింది..!
భారత్ వన్డే జట్టులో సమతౌల్యం లోపించిందని హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ అంగీకరించాడు. జట్టులోని ఆరు, ఏడు స్థానాల్లో ఆల్రౌండర్లు హార్థిక్ పాండ్య, రవీంద్ర జడేజా లేని లోపం స్పష్టంగా కనిపించిందని అభిప్రాయపడ్డాడు.
అంగీకరించిన రాహుల్ ద్రవిడ్
ఇంటర్నెట్డెస్క్: భారత్ వన్డే జట్టులో సమతౌల్యం లోపించిందని హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ అంగీకరించాడు. జట్టులోని ఆరు, ఏడు స్థానాల్లో ఆల్రౌండర్లు హార్థిక్ పాండ్య, రవీంద్ర జడేజా లేని లోపం స్పష్టంగా కనిపించిందని అభిప్రాయపడ్డాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేసిరీస్లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమై సిరీస్ను కోల్పోవడం కె.ఎల్. రాహుల్ కెప్టెన్సీపై ప్రభావం చూపబోదని ద్రవిడ్ పేర్కొన్నాడు.
వన్డే ఫార్మాట్లో జట్టు కూర్పులో పునఃసమీక్షించుకోవడంపై ద్రవిడ్ స్పందిస్తూ.. ‘‘జట్టులోని 6,7,8 స్థానాల్లో మాకు ఆల్రౌండ్ ఆప్షన్లు అందించేవారు ప్రస్తుతానికి అందుబాటులో లేరు. త్వరలో అందుబాటులోకి వస్తారనుకుంటున్నాను. వారు రావడంతోనే మా జట్టు మరింత బలపడుతుంది. అప్పుడు మరింత భిన్నంగా ఆడేందుకు అది సహకరిస్తుంది’’ అని పేర్కొన్నాడు. ద్రవిడ్ అభిప్రాయం గాయాల నుంచి కోలుకుని పాండ్యా, జడేజాలు అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని చెబుతోంది.
కేఎల్ కెప్టెన్సీలో ఇబ్బందేమీ లేదు..
కొత్త కెప్టెన్ కేఎల్ రాహుల్ను కోచ్ ద్రవిడ్ పూర్తిగా వెనుకేసుకొచ్చాడు. ప్రస్తుత జట్టుతో ప్రయత్నలోపం లేకుండా కృషి చేశాడని పేర్కొన్నాడు. ‘‘కేఎల్ రాహుల్ బాగా కృషి చేశాడు. ఓడిపోయిన జట్టు వైపు ఉండటం అంత తేలికకాదు. అతడు ఇప్పుడే నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. జట్టు క్రీడాకారుల్లోని ప్రతిభను వెలుగులోకి తెచ్చి వినియోగించుకోవడమే కెప్టెన్సీ అనే ముఖ్య విషయాన్ని నేర్చుకొంటాడు. మా వన్డే జట్టులో స్వల్ప కొరత ఉంది. ఉన్నంతలో మెరుగ్గా నాయకత్వ బాధ్యతలు నిర్వహించాడు. నిలకడగా నేర్చుకొంటూ మెరుగైన కెప్టెన్గా ఎదుగుతాడు’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
ఆ 20 ఓవర్లే కీలకం..
20-40 ఓవర్ల మధ్య టీమిండియా బ్యాటింగ్ మరికొంత మెరుగ్గా ఉండాల్సిందని ద్రవిడ్ ఓటములను విశ్లేషించాడు. ‘‘మిడిల్ ఓవర్లలో కచ్చితంగా మేము మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసిన రెండు సార్లూ స్కోర్ను 290 దాటించింది. అవే మ్యాచుల్లో మనం 30వ ఓవర్ వద్ద దక్షిణాఫ్రికా కంటే మెరుగైన స్థితిలో ఉండాల్సింది. కానీ, పేలవమైన షాట్లు, నాసిరకమైన క్రికెట్ ఆడటం వల్ల అలా జరగలేదు’’ అని పేర్కొన్నారు.
నిలకడగా అవకాశాలిస్తాం.. వారు రాణించి తీరాల్సిందే..
శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లకు నిలకడగా జట్టులో స్థానం కల్పించడంపై ద్రవిడ్ స్థిరమైన అభిప్రాయంతో ఉన్నాడు. అదే సమయంలో క్రీడాకారులు కూడా అద్భుతమై ఆటతీరు ప్రదర్శించాలని సూచించాడు. ‘‘మేము నిలకడగా అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాము. ఒక్కసారి వారికి స్థిరంగా అవకాశాలు రావడం మొదలయ్యాక.. మేము అద్భుతమైన ఆటతీరును డిమాండ్ చేస్తాం. దేశం తరపున ఆడుతున్న సమయంలో మంచి ఆటతీరు ఉండి తీరాల్సిందే. 4,5,6 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జట్టు అవసరాలను గ్రహించి అందుకు తగినట్లు ఆడాలి’’ అని పేర్కొన్నారు. ఈ మూడు మ్యాచుల్లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో శ్రేయస్ అయ్యర్ విఫలమైన విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో ఆడాలనుకుంటే వెంకటేష్ అయ్యర్ ఫిట్నెస్ను మెరుగు పర్చుకోవాలని ద్రవిడ్ సూచించాడు. వెంకటేష్ అయ్యర్ వంటి వారు ఆరో బౌలర్ కింద ఉపయోగపడతారని అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!