AUS vs SA: మ్యాచ్కు ముందు క్రికెటర్కి కరోనా.. క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్(AUS vs SA) సందర్భంగా ఆసీస్ జట్టు క్రికెటర్కి కరోనా అని తేలింది. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
సిడ్నీ: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య చివరి టెస్టు మ్యాచ్ సందర్భంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆసీస్ జట్టు ఆటగాడు మాథ్యూ రెన్షా(Matthew Renshaw) కరోనా బారిన పడ్డాడు. సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్ బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాస్ వేయడానికి ముందు మాథ్యూ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడికి అక్కడే ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష చేయగా పాజిటివ్గా తేలింది. అయినప్పటికీ తమ ఆటగాడు మ్యాచ్లో పాల్గొంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తెలపడం గమనార్హం.
దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మాథ్యూ టెస్టు సిరీస్లో ఆడుతున్నాడు. కరోనా(Carona Virus) పాజిటివ్గా తేలడంతో అతడు జట్టు నుంచి దూరంగా ఉంటూ మ్యాచ్లో పాల్గొనాల్సివచ్చింది. ‘‘ఇప్పటివరకు మా జట్టులో ఒక్కరు కూడా వైరస్ బారిన పడకపోవడం ఆశ్చర్యంగా ఉంది’’ అంటూ ఆసీస్ టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యాఖ్యానించిన కొంత సమయానికే ఈ వార్త బయటకు రావడం విశేషం.
‘‘ప్రస్తుతం పరిస్థితులన్నీ సాధారణంగా మారినట్టుగా అనిపిస్తోంది. కుటుంబాలతో కలిసి క్రిస్మస్ వేడుకలకు హాజరవ్వగలుగుతున్నాం. ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్నాం. మునుపటి రోజులు తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తోంది’’ అంటూ కమిన్స్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించాడు. అయితే, ఇలా కరోనా సోకినా మ్యాచ్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్గొనడం ఇది మొదటిసారి ఏమీ కాదు. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ మహిళల క్రికెట్ ఫైనల్లోనూ ఇదే జరిగింది. ఆసిస్ స్టార్ తహ్లియా మెక్గ్రాత్ సైతం పాజిటివ్ అని తేలినా మ్యాచ్లో పాల్గొనింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం