WPL: గుజరాత్‌పై దుమ్మురేపిన షఫాలీ.. ఫైనల్స్‌కు దిల్లీ

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

Updated : 13 Mar 2024 22:20 IST

దిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ను 126/9కే కట్టడి చేసిన దిల్లీ.. ఈ స్వల్ప లక్ష్యాన్ని 13.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షఫాలీ వర్మ (71; 37 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టింది. జెమీమా రోడ్రిగ్స్‌ (38*) పరుగులు చేసింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న దిల్లీ నేరుగా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. రెండో స్థానంలో నిలిచిన ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఎలినేటర్‌ మ్యాచ్‌లో తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు దిల్లీతో ఫైనల్‌లో తలపడనుంది. దిల్లీలో మార్చి 15న ఎలిమినేటర్‌, 17న టైటిల్‌ పోరు జరగనున్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని