Delhi : ఈ సీజన్లోనైనా దిల్లీ ‘పంతం’ నెగ్గుతుందా?
తెలుగు పారిశ్రామిక వేత్తకు చెందిన జీఎంఆర్ గ్రూప్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ సొంతమైన...
వార్నర్, శార్దూల్ కోసం భారీ మొత్తం వెచ్చించిన దిల్లీ
ఒకే ఒక్కసారి దేశవాళీ లీగ్ ఫైనల్కు చేరిన మూడు జట్లలో దిల్లీ కూడా ఉంది. అదీ మెగా టోర్నీ ప్రారంభమైన దాదాపు పుష్కరం తర్వాత కావడం విశేషం. గతేడాది యువ కెప్టెన్ రిషభ్ పంత్ నేతృత్వంలోని ప్లేఆఫ్స్ వరకు వెళ్లినా ఫైనల్కు చేరుకోలేకపోయింది. ఈసారి మెగా వేలంలో కీలక ఆటగాళ్లను దక్కించుకుని మరీ బరిలోకి దిగబోతోంది. మరి దిల్లీ కీలకం ఎవరు? ఓపెనింగ్, మిడిలార్డర్.. బౌలింగ్ దళం ఎలా ఉండనుంది? తదితర అంశాల్ని పరిశీలిస్తే..
తెలుగు పారిశ్రామికవేత్తకు చెందిన జీఎంఆర్ గ్రూప్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ సొంతమైన దిల్లీకి యువ క్రికెటర్ రిషభ్ పంత్ నాయకుడు. ఈ సారి మెగా వేలంలో నాణ్యమైన ఆటగాళ్ల కోసం చాలా తెలివిగా ఖర్చు పెట్టింది. టీమ్ఇండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు భారీ మొత్తం వెచ్చించింది. గత రెండు సీజన్లు తప్పించి అంతకుముందు వరకు హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్, సారథిగా ఫ్రాంచైజీకి టైటిల్ను అందించిన డేవిడ్ వార్నర్ (రూ.6.50 కోట్లు)ను ఈసారి దిల్లీ మంచి ధరకు సొంతం చేసుకొంది. అండర్ -19 ప్రపంచకప్ టైటిల్ను అందించిన యువ భారత్ సారథి యాష్ ధుల్తో సహా స్పిన్నర్ విక్కీ ఓత్స్వాల్ను దిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసుకుంది.
బ్యాటింగ్లో వీరే కీలకం..
బ్యాటింగ్పరంగా దిల్లీకి పెద్దగా ఇబ్బందులేమీ లేవు. అయితే విదేశీ ఆటగాళ్ల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. రిషభ్ పంత్, పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, రోవ్మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, కేఎస్ భరత్ కీలక ప్లేయర్లు. గత సీజన్ వరకు పృథ్వీషాకు తోడుగా శిఖర్ ధావన్ ఓపెనింగ్కు దిగేవాడు. ఈసారి ప్రమాదకర బ్యాటర్ డేవిడ్ వార్నర్ వచ్చేస్తాడు. వీరిద్దరూ కాసేపు నిలబడితే చాలు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ఆ తర్వాత రోవ్మన్ పావెల్ వచ్చే అవకాశం ఉంది. రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, అశ్విన్ హెబ్బర్/కేఎస్ భరత్/సీఫెర్ట్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ వరుసగా బ్యాటింగ్ చేయగలరు.
బౌలింగ్ దాడి సూపర్బ్..
దిల్లీ బౌలింగ్ దళం మాత్రం అద్భుతం. అంతర్జాతీయంగా పేసర్లు, స్పిన్నర్లతో ఎటాకింగ్గా ఉంది. ఆన్రిచ్ నార్జ్, లుంగి ఎంగిడి, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజర్ రెహ్మాన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మిచెల్ మార్ష్, కమ్లేష్ నాగర్కోటి వంటి బౌలర్లు ఉండటం దిల్లీకి సానుకూలాంశం. తుది జట్టులో మాత్రం తప్పనిసరిగా నార్జ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శార్దూల్, ముస్తాఫిజర్/మిచెల్ మార్ష్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ పరంగా రిజర్వ్ బెంచ్ కూడా పటిష్టంగా ఉంది.
టాప్ ఆల్రౌండర్లు దిల్లీ సొంతం
పొట్టి ఫార్మాట్లో కీలకమైన ఆల్రౌండర్లు దిల్లీ జట్టులోనూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఆల్రౌండర్గా ఎదుగుతున్న అక్షర్ పటేల్ను దిల్లీ రిటెయిన్ చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే, భారీ మొత్తం (రూ.10.75 కోట్లు) వెచ్చించి మరీ కొనుగోలు చేసిన శార్దూల్ ఠాకూర్, మిచెల్ మార్ష్ (రూ. 6.50 కోట్లు)తో పాటు రోవ్మన్ పావెల్ (రూ. 2.80 కోట్లు) ఇటు బౌలింగ్తోపాటు బ్యాటింగ్ చేయగల సమర్థులు. మిడిలార్డర్తోపాటు లోయర్ ఆర్డర్లోనూ పరుగులు సాధించగలరు. ఈ క్రమంలో రికీ పాంటింగ్ కోచింగ్.. రిషభ్ పంత్ నాయకత్వంలో ఈసారైనా కప్ నెగ్గాలని దిల్లీ యాజమాన్యం సహా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
దిల్లీ జట్టు ఇదే:
రిషబ్ పంత్ (కెప్టెన్), అశ్విన్ హెబ్బర్, డేవిడ్ వార్నర్, మన్దీప్ సింగ్, పృథ్వీ షా, రోవ్మన్ పావెల్, కేఎస్ భరత్, టిమ్ సీఫెర్ట్, అక్షర్ పటేల్, కమ్లేష్ నాగర్కోటి, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబె, రిపల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, విక్కీ ఓత్స్వాల్, యాష్ ధుల్, ఆన్రిచ్ నార్జ్, చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, ముస్తాఫిజర్ రహ్మాన్, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
T20 jersey: టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమ్ఇండియా జెర్సీల ధరను అడిడాస్ ప్రకటించింది. -
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్