IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. ఓపెనర్గా గిల్ వద్దు: సునీల్ గావస్కర్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో (IND vs SA) భాగంగా తొలి మ్యాచ్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సునీల్ గావస్కర్ తన తుది జట్టును ప్రకటించాడు.
ఇంటర్నెట్ డెస్క్: డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికా - భారత్ జట్ల మధ్య (SA vs IND) తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మకు జోడీగా శుభ్మన్ గిల్ కాకుండా యశస్వి జైస్వాల్ను ఓపెనర్గా పంపించాలని టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తెలిపాడు. ‘‘వన్డౌన్లో శుభ్మన్ గిల్. టెస్టుల్లో కీలకమైన విరాట్ కోహ్లీని సెకండ్ డౌన్లో పంపించాలి. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయాలి. శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్లో ఆడాలి. వారిద్దరూ పరిస్థితిని బట్టి ముందూ వెనుకా ఆర్డర్లో బ్యాటింగ్కు వస్తారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకోవాలి. పేస్ విభాగం మాత్రం బుమ్రా, సిరాజ్తోపాటు ముకేశ్ కుమార్ను మూడో ఫాస్ట్ బౌలర్గా ఎంపిక చేస్తున్నా’’ అని గావస్కర్ వెల్లడించాడు.
కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా రాణిస్తాడు: గంభీర్
టెస్టుల్లో వికెట్ల వెనుక బంతిని కాచుకోవడం చాలా కష్టమైన పనే. ఓపికగా కీపింగ్ చేయాల్సి ఉంటుంది. బంతిలో వైవిధ్యం ఎక్కువగానూ ఉండటం వల్ల ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. చాలా రోజుల తర్వాత టెస్టుల్లో వికెట్ కీపింగ్ బాధ్యతలను కేఎల్ రాహుల్ చేపట్టబోతున్నాడు. అయితే, కేఎల్ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాడని భావిస్తున్నట్లు గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘‘కేఎల్ రాహుల్కు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో పెద్ద సవాళ్లు ఎదురుకాకపోవచ్చు. రాణిస్తాడనే నమ్మకం ఉంది. కానీ, అసలైన పరీక్ష మాత్రం ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లోనే ఎదురుకానుంది. రిషభ్ పంత్ వచ్చే వరకు కేఎల్తోనే కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించేలా చేయడం మంచిదే. ఒకవేళ ఇంగ్లాండ్తో సిరీస్కు పంత్ అందుబాటులో లేకపోతే కేఎల్నే వికెట్ కీపర్గా కొనసాగించొచ్చు’’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.