Team India: టీమ్ఇండియాలో ఆ ఇద్దరు ‘జెంటిల్మెన్’: బీసీసీఐ ఏసీయూ మాజీ చీఫ్ నీరజ్ కుమార్
భారత జట్టుతో తనకున్న అనుబంధంపై దిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ స్పందించారు. బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్కు ఆయన చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ చీఫ్గా ఉన్నప్పుడు తనతో క్రికెటర్లు ఎంతో మర్యాదగా ఉండేవారని దిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ వెల్లడించారు. క్రికెట్ బోర్డులో అవినీతి లేకుండా చేయడానికి బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ను ఏర్పాటు చేసింది. దానికి చీఫ్గా నీరజ్ 2015-2018 వరకు వ్యవహరించారు. తాజాగా తన హయాంలో భారత ఆటగాళ్లతో సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ (Virat Kohli) ‘వర్క్ ఎథిక్స్’ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాయని తెలిపారు.
‘‘చాలా మంది క్రికెటర్లతో తరచూ మాట్లాడేవాడిని. అవినీతి నిరోధక శాఖ కావడంతో ప్రతి విషయాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ చాలా గౌరవించారు. ఇద్దరు మాత్రం ఎక్కువగా మాట్లాడేవారు కాదు. భువనేశ్వర్ కుమార్, అజింక్య రహానె అద్భుతమైన ఆటగాళ్లు. వారిని జెంటిల్మెన్ అనడంలో సందేహం లేదు. ఆటపట్ల నిబద్ధత విషయంలో విరాట్ కోహ్లీ టాప్. అతడి ట్రైనింగ్ కూడా ఇతర క్రికెటర్లకు ఆదర్శం. కొంతమంది తమ స్థానిక భాషలో మాట్లాడుతుంటారు. కొన్ని పదాలు అసభ్యంగా అనిపించినా.. అవేవీ పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు’’ అని తెలిపారు.
క్రోనే మ్యాచ్ ఫిక్సింగ్ దర్యాప్తులోనూ..
ఐపీఎస్ అధికారి అయిన నీరజ్ కుమార్ 37 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పని చేశారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్, చండిలా, అంకిత్ చవాన్లను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. శ్రీశాంత్పై బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏడేళ్లకు శిక్షను కుదించింది. 2020లో అతడిపై నిషేధం వైదొలిగింది. సరైన ఆధారాలున్నా తగిన చట్టం లేకపోవడం వల్లే శ్రీశాంత్ తప్పించుకున్నాడని నీరజ్ కుమార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రీడల్లో అవినీతి నిరోధానికి చట్టం అవసరమని అభిప్రాయపడ్డారు. 2000లోనే దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హ్యాన్సీ క్రోనే మ్యాచ్ ఫిక్సింగ్ కేసు సీబీఐ దర్యాప్తులో కూడా ఈ అధికారి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర