WI vs IND: అతడిని తీసుకోకపోవడానికి కారణమేంటో చెప్పాల్సిందే: టీమ్ఇండియా మాజీలు
విండీస్ పర్యటనకు భారత జట్టు (WI vs IND) ఎంపికపై విమర్శలు వచ్చాయి. దేశవాళీలో రాణించిన వారికి అవకాశం ఇవ్వకపోవడంతో మాజీలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: జులై 12 నుంచి విండీస్ పర్యటన (WI vs IND) ప్రారంభం కానుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకకటించింది. అయితే, టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన జట్టులోకి దేశవాళీ నాణ్యమైన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ 79.65 సగటుతో డొమిస్టిక్ క్రికెట్లో అదరగొట్టాడు. ఈ క్రమంలో అతడిని ఎంపిక చేయకపోవడంపై టీమ్ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా స్పందించాడు. అతడిని తీసుకోకపోవడానికిగల కారణాలను సెలక్షన్ కమిటీ వెల్లడించాలన్నాడు. టీమ్ ఎంపికపై తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా విశ్లేషించాడు.
‘‘గత మూడేళ్లుగా సర్ఫరాజ్ గణాంకాలను ఓ సారి చూడండి. అతడు ఇంకేం చేయాలి?డొమెస్టిక్లో ప్రతి మ్యాచ్లోనూ రాణిస్తున్నాడు. అతడిని ఎంపిక చేయకుండా ఏం సందేశం ఇస్తారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఒకవేళ ఇతర కారణం ఉంటే అదేంటో ప్రజలకు చెప్పాలి. సర్ఫరాజ్ ఖాన్ ప్రదర్శనలో ఫలానా విషయం నచ్చలేదని వెల్లడించాలి. అతడిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. ఒకవేళ ఫస్ట్క్లాస్ క్రికెట్ పరుగులకు విలువ లేకపోతే.. వదిలేయండి’’ అని చోప్రా వ్యాఖ్యానించాడు.
వారు ఐపీఎల్ ఆడలేదు.. : జాఫర్
వెస్టిండీస్ పర్యటనకు జట్టు ఎంపికపై వసీం జాఫర్ పెట్టిన ట్వీట్ వైరల్గా మారింది. ట్వీట్లోని అంశాలివీ..
1. నలుగురు ఓపెనర్ల అవసరం ఏంటి? దానికి బదులుగా సర్ఫరాజ్ ఖాన్ను తీసుకుంటే మిడిలార్డర్లో అక్కరకొస్తాడు. దేశవాళీలో నిలకడైన ఆటతీరు ప్రదర్శించాడు.
2. ఈశ్వరన్, పంచల్ కూడా రంజీ ట్రోఫీలోనూ, భారత్ A జట్టు తరఫున రాణించారు. చాలా రోజులుగా టెస్టుల్లోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే, వారు ఐపీఎల్ ఆడలేదు. అందుకే వారిని పరిగణనలోకి తీసుకోలేదా? రుతురాజ్ ముందుకు ఎలా వచ్చాడు?
3. షమీకి విశ్రాంతి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. దాదాపు నెల రోజులపాటు విరామం వచ్చినప్పటికీ విశ్రాంతి ఇచ్చారు. అతడి ఫామ్ను బట్టి తప్పకుండా జట్టులో ఉండాల్సిన బౌలర్.
సంజూకు మంచి అవకాశం: ఇర్ఫాన్
రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. వికెట్ కీపర్గా విండీస్ పర్యటనకు ఎంపికైన సంజూ శాంసన్ మరింతకాలం వన్డే క్రికెట్ ఆడే అవకాశం ఉందని భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. ‘‘పంత్ ఇంకా రికవరీ అవుతూనే ఉన్నాడు. సంజూ శాంసన్కు వన్డే క్రికెట్లో మరింతకాలం కొనసాగేందుకు మంచి అవకాశం వచ్చింది. మిడిల్ఆర్డర్లో కీలకంగా మారతాడు. విండీస్తో సిరీస్లో రాణిస్తాడనే నమ్మకం ఉంది’’ అని పోస్టు పెట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాశ్రయానికి వెళ్లడానికి భయపడ్డా
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తాను.. జనం చూస్తే ఎలా అన్న భయంతో చక్రాల కుర్చీలో విమానాశ్రయానికి వెళ్లడానికి ఇష్టపడలేదని టీమ్ఇండియా వికెట్కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తెలిపాడు. -
‘డి’ అంటే ఢీ
పొట్టి క్రికెట్లో మహా పోరుకు రంగం సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచకప్ ఇంకో నాలుగు రోజుల్లోనే ఆరంభం కాబోతోంది. ఈసారి పెద్ద జట్లకు తోడు మధ్య స్థాయివి, కూనలు కలిపి మొత్తం 20 జట్లు టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. -
ప్రపంచకప్తో రాత మారుతుంది
ఆటల్లో అమెరికా అనగానే ఫుట్బాల్, బాస్కెట్బాల్, బేస్బాల్ లాంటి క్రీడలే గుర్తుకు వస్తాయి. కానీ దేశాన్ని ఇప్పుడు క్రికెట్ జ్వరం పట్టుకుంది. తాజాగా బంగ్లాదేశ్పై అమెరికా క్రికెట్ జట్టు చారిత్రక సిరీస్ విజయాన్ని అందుకుంది. -
సాత్విక్ జోడీకి షాక్
భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టిలకు షాక్! సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఈ నంబర్వన్ జంట తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. -
రూడ్ శుభారంభం
దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ ఓటమితో తొలి రోజు ప్రకంపనలు రేగిన ఫ్రెంచ్ ఓపెన్లో రెండో రోజు ఆశ్చర్యకర ఫలితాలేమీ లేకుండా అంతా సాధారణంగా సాగిపోయింది. ఏడో సీడ్ కాస్పర్ రూడ్ టోర్నీలో శుభారంభం చేశాడు. -
హంపి శుభారంభం
భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి స్టావెంజర్ చెస్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మంగళవారం తొలి రౌండ్ మొదటి గేమ్లో పియా క్రామ్లింగ్ (స్విట్జర్లాండ్)తో డ్రా చేసుకున్న హంపి.. రెండో గేమ్లో విజయాన్ని అందుకుంది. -
నిశాంత్ రెండు నిమిషాల్లోనే..
ప్రపంచ బాక్సింగ్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత కుర్రాడు నిశాంత్ దేవ్ దూసుకెళ్తున్నాడు. 71 కేజీల విభాగంలో అతడు ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో నిశాంత్ కేవలం 2 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట్గాన్బాటర్ (మంగోలియా)ని చిత్తు చేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
పోలవరం మీదుగా విస్తృత జలరవాణా.. అందుకు అనుగుణంగా ప్రాజెక్టులో కొన్ని మార్పులు
-
ప్రియురాలి తీరుతో మనస్తాపం.. యువకుడి ఆత్మహత్య
-
పెంచిన బంధం.. కన్నీటి సంద్రం
-
అధ్వాన రహదారితో అంబులెన్సుకు ప్రమాదం
-
పెళ్లి జరిగిన సంప్రదాయం ప్రకారమే విడాకులు
-
విమానం రద్దయినట్లు చెప్పకపోవడంతో రేణిగుంటలో ప్రయాణికుల అవస్థలు