Gambhir - Virat: కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.. లేకపోతే అంతా విరాట్లా ఉండాలనుకుంటారు: మనోజ్
ఐపీఎల్ సీజన్ (IPL 2023) సజావుగా జరగాలంటే బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని.. ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకునే అవకాశం ఏమాత్రం ఇవ్వకూడదని టీమ్ఇండియా మాజీ ఆటగాడు మనోజ్ తివారీ పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో (IPL) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - లఖ్నవూ సూపర్ జెయింట్స్ (LSG vs RCB) మ్యాచ్లో విరాట్ - గంభీర్ వాగ్వాదంపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. ఆయా జట్ల అభిమానులు వారికి ఇష్టమైన క్రికెటర్లకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా కోల్కతా నైట్రైడర్స్ మాజీ ఆటగాడు మనోజ్ తివారీ కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సంఘటన జరగడానికి గల కారణాలను వెలికి తీయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. మైదానంలో వారిద్దరు ప్రవర్తించిన తీరు సరైందికాదని పేర్కొన్నాడు. గంభీర్ లేదా విరాట్ను ఇలాంటి ‘దూకుడు’తో గుర్తు పెట్టుకోవాలని అనుకోవడం లేదని తెలిపాడు. భారత్ జట్టు కోసం చేసిన కృషిని మాత్రమే తలుచుకుంటారని వ్యాఖ్యానించాడు.
‘‘విరాట్ - గంభీర్ గొప్ప ఆటగాళ్లు. వీరిలో విరాట్ ఇంకా ఆడుతూనే ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో అతడొకడు. ఇలాంటి వ్యవహారంపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. క్రికెట్కు రాయబారిగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రవర్తనను అసలు ఉపేక్షించకూడదు. ప్రపంచంలోనే అత్యంత భారీ టోర్నీ ఐపీఎల్. ఇలాంటి సంఘటనలను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు చూస్తారు. మరీ ముఖ్యంగా యువతలో ఎక్కువ మంది విరాట్ కోహ్లీలా మారాలని కోరుకుంటారు. అందుకే బీసీసీఐ కఠిన చర్యలకు ఉపక్రమించాలి. వివాదంపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలి. ఆరోగ్యకరమైన పోటీతత్వం క్రీడలకు మంచిది. కానీ, ఇలాంటి సంఘటనలను మాత్రం కచ్చితంగా అడ్డుకొని తీరాల్సిందే’’అని మనోజ్ తివారీ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..