IND vs ENG: శుభ్మన్ గిల్ ఫామ్ అందుకోవాలంటే.. రాహుల్ ద్రవిడ్ చేయాల్సిందదే: పీటర్సెన్
శుభ్మన్ గిల్ (Shubman Gill) మళ్లీ పుంజుకొని ఫామ్లోకి రావడం భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల్లోనే ఉందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో (IND vs ENG) భారత యువ ఆటగాడు శుభ్మన్ గిల్ విఫలమయ్యాడు. ఇటీవల టెస్టుల్లో గొప్పగా రాణించలేకపోతున్నాడు. గిల్లో అద్భుతమైన నైపుణ్యం ఉందని.. అయినా రాణించలేకపోతున్నాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సెన్ వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు కెవిన్ కీలక సూచనలు చేశాడు. గిల్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నాడు.
‘‘శుభ్మన్ గిల్ ఆటతీరును మార్చగలిగే శక్తి రాహుల్ ద్రవిడ్కే ఉంది. ఇప్పుడు నేను చెప్పే మాటలను కోచ్ బ్రాడ్కాస్ట్లో చూస్తాడో లేదో తెలియదు. గిల్ మళ్లీ పుంజుకొని విజృంభించాలంటే మాత్రం కోచ్గా రాహుల్ ద్రవిడ్ చేయాల్సింది చాలా ఉంది. గిల్తో మాట్లాడి.. ఎక్కువ సమయం గడపడం వల్ల తప్పకుండా ఆటలో మార్పు వస్తుందని భావిస్తున్నా. ప్రాక్టీస్, స్ట్రైక్ రొటేట్ ఎలా చేయాలనే దానిపై కసరత్తు వల్ల మరింత మెరుగవుతాడు. గిల్ టాలెంట్ విషయంలో సందేహం అక్కర్లేదు. అతడిలో ఒకే ఒక్క లోపం కనిపిస్తోంది. స్ట్రైక్ను రొటేట్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. మరీ ముఖ్యంగా స్పిన్నర్ల విషయంలో వెనకడుగు వేస్తున్నాడు. షాట్ల ఎంపికలో ఇప్పటికీ కుర్రతనం పోలేదు. అతడికి అర్థమయ్యేలా చెప్పగలడం, దారిలోకి తేవడం కోచింగ్ స్టాఫ్ బాధ్యత. ఇవన్నీ రాహుల్ ద్రవిడ్ స్వయంగా పర్యవేక్షించాలి. ఒక్కసారి కుదురుకుంటే మాత్రం గిల్ వెనక్కి తిరిగి చూడడు’’ అని కెవిన్ వ్యాఖ్యానించాడు.
ఉప్పల్ టెస్టులో గిల్ 23 పరుగులకే పెవిలియన్కు చేరాడు. క్రీజ్లో కుదురుకునేందుకు సమయం తీసుకున్నప్పటికీ దానిని భారీ ఇన్నింగ్స్గా మార్చడంలో విఫలమయ్యాడు. మొత్తం 66 బంతులు ఆడిన గిల్ రెండు బౌండరీలు బాదాడు. అనవసర షాట్కు యత్నించి మిడ్వికెట్ ఫీల్డర్కు దొరికిపోయాడు. అంతకముందు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లోనూ గొప్పగా రాణించలేకపోయాడు. మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం కావడంతో విమర్శలు వస్తున్నాయి. గతేడాది ఆసీస్తో నాలుగో టెస్టులో సెంచరీ సాధించిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. మూడో స్థానంలో బ్యాటింగ్కు రావడం కూడా అతడి ఆటపై ప్రభావం పడుతుందనేవారూ లేకపోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి