Gautam Gambhir: అయితే భయపడండి.. లేకపోతే నాయకుడిగా ఉండండి: గంభీర్ పోస్టు వైరల్
నాయకత్వం గురించి టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్(Gautam Gambhir) షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్గా మారింది.
ఇంటర్నెట్డెస్క్: అనుకున్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేస్తుంటాడు టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్(Gautam Gambhir). ప్రస్తుతం గంభీర్ ఐపీఎల్లో లఖ్నవూ జట్టు నుంచి కోల్కతా నైట్రైడర్స్(KKR)కు మారిపోయాడు. ఆ జట్టుకు మార్గనిర్దేశకుడి పాత్ర పోషించనున్నాడు. ఈ సమయంలో ఆయన పెట్టిన ఓ పోస్టు నెట్టింట్లో వైరల్గా మారింది.
నాయకత్వం గురించి వార్ హీరో, ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా(Field Marshal Sam Manekshaw) మాట్లాడిన ఓ వీడియోను గంభీర్ షేర్ చేశాడు. ‘ఒకసారి మీ భయాన్ని బయటపెట్టిన తర్వాత మీరు నిష్క్రమించాలి’ అంటూ ఆ వీడియోలో మానెక్ షా మాట్లాడారు. ఆయన మాటలకు గంభీర్ స్పందిస్తూ.. ‘అయితే భయపడండి.. లేకపోతే ఒక నాయకుడిగా ఉండండి’ అని వ్యాఖ్యను జోడించాడు.
Gautam Gambhir - KKR: కోల్కతా రాత మారుస్తాడా!
ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం గంభీర్ టీ20 ప్రపంచకప్ సారథ్యం గురించి తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్లో మాత్రం టీమ్ఇండియాను రోహిత్ శర్మనే నడిపించాలని సూచించాడు. వన్డే ప్రపంచ కప్లో రోహిత్ సారథ్య పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!