Viral : స్కూటర్‌ మీద షికారు.. ఈ స్టార్ల జోడీని గుర్తుపట్టారా..?

వారిద్దరూ స్టార్లు.. భార్యాభర్తలు.. ఎడతెరిపి లేని బిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు. అయితే కొన్ని రోజులు విధుల నుంచి విరామం తీసుకుని సరదాగా గడిపిన...

Updated : 22 Aug 2022 11:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వారిద్దరూ స్టార్లు.. భార్యాభర్తలు.. ఎడతెరిపి లేని బిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు. అయితే కొన్ని రోజులు విధుల నుంచి విరామం తీసుకుని సరదాగా గడిపిన ఆ ఇద్దరూ తాజాగా ఓ ఫొటో షూట్‌కు సిద్ధమైపోయారు. ఇంతకీ ఆ ఇద్దరు సెలబ్రిటీలు మరెవరో కాదు..  స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ. ఇందులో విశేషం ఏముందంటారా..? అయితే వారిద్దరూ తమ షూటింగ్‌ స్పాట్‌కు వచ్చిన విధానమే నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

లగ్జరీ కార్లను వదిలేసి మరీ స్కూటర్‌ మీద షికారు చేస్తూ ముంబయిలోని మధ్‌ ఐస్‌ల్యాండ్‌కు వచ్చేశారు. అయితే వీరిద్దరూ అభిమానుల నుంచి తప్పించుకునేందుకు హెల్మెట్లు పెట్టుకునీ మరీ రావడం విశేషం. స్కూటర్‌ మీద వచ్చి షూటింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాత విరాట్-అనుష్క ఫొటోలకు పోజులిచ్చారు. ఆ ఫొటోలను మీరూ చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని