RCB vs GT: శతకంతో గిల్ విధ్వంసం.. బెంగళూరు ఓటమి.. ప్లేఆఫ్స్కు ముంబయి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్. ప్లేఆఫ్స్కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో 8 విజయాలతో ముంబయి జట్టు ఫ్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
బెంగళూరు: విరాట్ కోహ్లీ శతకం వృథా అయింది. కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తడబడింది. ప్లేఆఫ్స్కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో 8 విజయాలతో ముంబయి జట్టు ఫ్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్మన్ గిల్(104*: 52 బంతుల్లో 8 సిక్స్లు, 5 ఫోర్లు) మెరుపు శతకం చేసి ఒంటిచేత్తో తమ జట్టుకు విజయాన్నిందించాడు. విజయ్ శంకర్ (53: 35 బంతుల్లో 2 సిక్స్లు, 7 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 2, విజయ్కుమార్ వైశక్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు. పార్నెల్ 3.1 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చుకున్నాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (101*) సెంచరీతో చెలరేగాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2, షమీ, దయాల్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్తో ఈ సీజన్ లీగ్ దశ ముగిసింది. సెంచరీతో చెలరేగిన గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.
గిల్ విశ్వరూపం.. రాణించిన శంకర్
198 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ 25 పరుగుల వద్ద సాహా రూపంలో తొలివికెట్ కోల్పోయింది. అయితే తొలి వికెట్ తీసిన ఆనందం బెంగళూరుకు ఎంతో సేపు నిలవలేదు. విజయ్ శంకర్తో జట్టు కట్టిన శుభ్మన్ గిల్ వీరవిహారం చేశాడు. రెండో ఓవర్ నుంచే ఫోర్లతో విరుచుకుపడిన గిల్ ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 51 పరుగులతో నిలిచింది. ఆ తర్వాత గేరు మార్చిన గిల్ విధ్వంసం సృష్టించాడు. బౌలర్ ఎవరైనా లెక్కచేయకుండా సిక్స్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 90 పరుగులు చేసింది. మరోవైపు మెళ్లిగా పుంజుకున్న విజయ్ శంకర్ సైతం ఫోర్లు, సిక్స్లతో మెరిపించాడు. ఈక్రమంలో గిల్ 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. అర్ధసెంచరీ అనంతరం మరింతగా చెలరేగిన గిల్ 13వ ఓవర్ వేసిన బ్రేస్వెల్కు చుక్కలు చూపాడు. రెండు సిక్స్లతో మొత్తం 16 పరుగులు పిండుకున్నాడు.
15వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, ఒక సిక్స్తో అర్ధసెంచరీ చేసి మంచి ఊపుమీదున్న విజయ్ శంకర్ను విజయ్కుమార్ ఔట్ చేశాడు. 15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే ఆ తర్వాత వచ్చిన శనక డౌకౌట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్(6) సైతం వెంటనే ఔట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠ స్థితికి చేరుకునే అవకాశం ఉందని భావించారు. చివరి మూడు ఓవర్లలో గుజరాత్ విజయానికి 34 పరుగులు అవసరం. అయితే ఒత్తిడిని చిత్తుచేస్తూ గిల్ 18వ ఓవర్లో రెండు సిక్స్లతో మొత్తం 15 పరుగులు రాబట్టాడు. దీంతో గెలుపు సమీకరణం 12 బంతుల్లో 19 పరుగులుగా మారింది. 19వ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. దీంతో గెలుపు సమీకరణం 6 బంతుల్లో 8 పరుగులుగా మారింది. 20వ ఓవర్లో తొలి బంతి నోబాల్ కాగా, మరుసటి వైడ్ అయింది. మరోవైపు 98 పరుగులతో సెంచరీకి చేరువైన గిల్ సిక్స్ కొట్టి సెంచరీ చేయడంతో పాటు ఇన్నింగ్స్ను ముగించాడు.
విరాట్ విధ్వంసం..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. డుప్లెసిస్(28: 19 బంతుల్లో) కలిసి బరిలోకి దిగిన కోహ్లీ(101*: 61 బంతుల్లో ఒక సిక్స్, 13 ఫోర్లు) ఆరంభం నుంచే దూకుడుగా ఆడడంతో మంచి భాగస్వామ్యం లభించింది. తొలి వికెట్ వీరు 67 పరుగులు చేశారు. ఈ క్రమంలో 7.1 ఓవర్ల వద్ద డుప్లెసిస్ ఔట్ కావడంతో మాక్స్వెల్(11) క్రీజులోకి వచ్చాడు. అయితే 80 పరుగుల వద్ద మాక్స్వెల్, 85 పరుగుల వద్ద లామ్రోర్(1) స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో బెంగళూరు స్కోర్ ఒకింత నెమ్మదించింది. అయితే బ్రేస్వెల్(26: 16 బంతుల్లో 5 ఫోర్లు)తో జట్టు కట్టిన కోహ్లీ మరింత దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో కోహ్లీ అర్ధశతకం చేశాడు. మరోవైపు దూకుడుగా ఆడే క్రమంలో బ్రేస్వెల్ 14వ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. అప్పటికీ ఆర్సీబీ స్కోర్ 132. ఆతర్వాత వచ్చిన కార్తిక్ డకౌట్ అయ్యాడు. దీంతో అనుజ్ రావత్(23*: 15 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్)తో ఇన్నింగ్స్ నిర్మించిన కోహ్లీ ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాడు. 15 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసిన ఆర్సీబీ.. మిగతా ఐదు ఓవర్లలో 61 పరుగులు చేసింది. కోహ్లీ ఎడాపెడా ఫోర్లు బాదాడు. మరోవైపు అనుజ్ సైతం దాటిగా ఆడడంతో గుజరాత్కు బెంగళూరు భారీ స్కోర్ను లక్ష్యంగా నిర్దేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా