Ishan - Dhoni: ధోనీ ఘనతలో 70 శాతం సాధించినా ఆనందమే: ఇషాన్ కిషన్
బంగ్లాదేశ్పై అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించి ఔరా అనిపించిన ఇషాన్ కిషన్ను భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో అభిమానులు పోల్చడం ప్రారంభించారు. ఎందుకంటే ఇద్దరూ ఒకే రాష్ట్రం నుంచి వచ్చినవారే కాకుండా దూకుడుగా ఆడటంలో ముందుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇద్దరూ ఝార్ఖండ్ నుంచి వచ్చినవారే.. ఒకరేమో టీమ్ఇండియాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఐసీసీ ప్రపంచకప్లను అందించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కాగా.. దూకుడైన ఆటతీరుతో అభిమానుల మనస్సును కొల్లగొట్టిన యువ బ్యాటర్ ఇషాన్ కిషన్. వీరిద్దరూ కీపర్లే కావడం విశేషం. ఇటీవల బంగ్లాదేశ్పై ఇషాన్ డబుల్ సెంచరీతో అబ్బురపరిచాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజంతో కిషన్ను పోలుస్తూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఇలా తనను ధోనీతో పోల్చడంపై ఇషాన్ ఆనందం వ్యక్తం చేస్తూనే.. అంతటి స్థాయికి చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుందని వెల్లడించాడు.
‘‘నేను గిల్క్రిస్ట్ బ్యాటింగ్ను, వికెట్ కీపింగ్ను ఇష్టపడతా. ఇక ధోనీ భాయ్ను మైదానంలోనూ, వెలుపల చూశా. నిశ్శబ్దంగా ఉంటూ అందరితో కలివిడిగా ఉండే అతడి క్యారెక్టర్ నుంచి నేర్చుకొనేందుకు చాలా విషయాలు ఉన్నాయి. జీవితంలో ఇవే చాలా కీలకంగా మారతాయి. గొప్ప ఆటగాళ్ల నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా ఇలాంటి అంశాలే. నన్ను ధోనీ వంటి దిగ్గజంతో పోల్చడం నాకు బాగానే ఉంటుంది. నేను కూడా పాజిటివ్గా తీసుకొంటా. ఇలా స్టార్తో పోలుస్తున్నారంటే నాలోనూ ఏదో టాలెంట్ ఉందని అనిపిస్తుంటుంది. అందుకే ధోనీ సాధించిన ఘనతల్లో కనీసం 70 శాతం వరకు చేసినా నాకు ఆనందమే. ఎందుకంటే అతడి నాయకత్వంలోనే చాలా రోజుల తర్వాత వన్డే ప్రపంచకప్తోపాటు తొలి టీ20 వరల్డ్ కప్ను సగర్వంగా ఎత్తుకోగలిగాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా జట్టును గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’’ అని ఇషాన్ తెలిపాడు.
ఇషాన్నే ఓపెనర్గా పంపాలి: బ్రెట్ లీ
వన్డేలు, టీ20ల్లో ఓపెనర్గా విఫలమైన కేఎల్ రాహుల్ స్థానంలో టీమ్ఇండియా మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్ను ఓపెనర్గా పంపించాలని ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్లీ సూచించాడు. ‘‘వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ భారత్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా తన ఓపెనర్ స్లాట్ను ఇషాన్ కిషన్తో భర్తీ చేయాలి. ఇది జరుగుతుందా..? అంటే నేను చెప్పలేను. కానీ ఇషాన్ అయితే సరైన బ్యాటర్ అని మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఇటీవలే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీని సాధించిన విషయం మరిచిపోకూడదు. ఇలానే నిలకడగా ఆడుతూ.. ఫిట్గా ఉంటే మాత్రం ఓపెనర్గా ఇషాన్ను బరిలోకి దింపాల్సిందే’’ అని బ్రెట్లీ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్