IND vs ENG: వారికి ‘బజ్బాల్’ ఉంటే.. మనకు ‘విరాట్బాల్’: క్రికెట్ దిగ్గజం
టెస్టుల్లో తలపడేందుకు భారత్, ఇంగ్లాండ్ (IND vs ENG) జట్లు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా గురువారం నుంచి హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే గురువారం నుంచి భారత్ - ఇంగ్లాండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టుల్లోనూ దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థులకు ఇంగ్లిష్ జట్టు వణుకు పుట్టిస్తోంది. గత యాషెస్ సిరీస్లో ఆసీస్ చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడినప్పటికీ ఇంగ్లాండ్ ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. పుంజుకొని మరీ విజయమే లక్ష్యంగా ఆఖరి మూడింట్లో తలపడింది. రెండు విజయాలు నమోదు చేసి.. మరొక దానిని డ్రా ముగించింది. దీంతో సిరీస్ సమమైంది. ఇప్పుడు మరోసారి బజ్బాల్ (BazBall) క్రికెట్ రుచి చూపించేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఇంగ్లాండ్ బజ్బాల్ క్రికెట్ ఆడితే.. టీమ్ఇండియా వద్ద మరో ఆయుధం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ (Virat Kohli) రూపంలో ‘విరాట్ బాల్’ గేమ్తో ఇంగ్లాండ్కు కౌంటర్ ఇస్తామని పేర్కొన్నాడు.
‘‘విరాట్ బ్యాటింగ్ తీరు అద్భుతంగా ఉంది. మంచి ఫామ్లో ఉన్నాడు. అందుకే నమ్మకంగా చెబుతున్నా ‘బజ్ బాల్’కు విరాట్ బాల్తో కౌంటర్ ఇస్తాం. ఇప్పటి వరకు 113 టెస్టుల్లో 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారీ స్కోర్లుగా ఎలా మలచాలో కోహ్లీకి బాగా తెలుసు. ఇంగ్లాండ్ గత రెండేళ్లుగా కొత్త విధానంతో ఆడుతోంది. దూకుడే లక్ష్యంగా వారి బ్యాటింగ్ సాగుతోంది. పరిస్థితి ఏంటనేది కాకుండా ఎటాకింగ్ ఆడేస్తారు. ఇప్పుడు ఇదే ఆటతీరు భారత్ వేదికగా జరగబోయే టెస్టు సిరీస్లోనూ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. మరీ ముఖ్యంగా స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది’’ అని గావస్కర్ తెలిపాడు.
సూపర్ ఫామ్లో విరాట్: ఇర్ఫాన్ పఠాన్
‘‘విరాట్ కోహ్లీ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. భారత అభిమానులకు శుభవార్త. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ సూపర్ టచ్లో కనిపించాడు. క్లిష్టమైన పిచ్లపై అనుభవంతో ఆడాడు. పాదాల కదలిక కూడా బాగుంది. ఇంగ్లాండ్తో సిరీస్లోనూ భారీ స్కోర్లు చేస్తాడనే నమ్మకముంది’’ అని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్లో మరో 152 పరుగులు చేస్తే టెస్టుల్లో 9వేల పరుగుల మైలురాయిని అందుకొన్న నాలుగో భారత బ్యాటర్గా కోహ్లీ నిలుస్తాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు