IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్.. నేనైతే ఎక్కువ డబ్బు డిమాండ్ చేసేవాడిని: క్రిస్ గేల్
రానున్న వన్డే ప్రపంచ కప్లో భారత్, ఇంగ్లాండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ సెమీస్కు చేరుతాయని వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ (Chris Gayle)అంచనా వేశాడు. అంతేకాదు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో వన్డే ప్రపంచ కప్ (World Cup 2023) జరగనున్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఇటీవల షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. అక్టోబర్ 5న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్తో ఈ మహా సమరం మొదలుకానుంది. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ మెగా టోర్నీలో ఏఏ జట్లు సెమీ ఫైనల్ చేరుతాయనే అంశంపై ఇప్పటి నుంచే పలువురు క్రికెటర్లు విశ్లేషణలు చేస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ ఈ సారి సెమీస్కు చేరుతాయని వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ అంచనా వేశాడు. అక్టోబర్ 15న అహ్మదాబాద్లో భారత్, పాక్ మధ్య జరిగే హై హోల్టేజీ మ్యాచ్ గురించి కూడా క్రిస్ గేల్ (Chris Gayle) మాట్లాడాడు.
ఇండియా, పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ జరిగినప్పుడల్లా, ముఖ్యంగా ప్రపంచ కప్లో ఈ జట్లు ఆడినప్పుడు నిర్వాహకులకు ఆదాయం భారీగా సమకూరుతుందని చెప్పాడు. ఈ ఒక్క మ్యాచ్ ద్వారా ఐసీసీ ఈవెంట్కు అయ్యే మొత్తం ఖర్చు వస్తుందని పేర్కొన్నాడు. భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు ఎక్కువ డబ్బు డిమాండ్ చేయాలని, ఎందుకంటే ఆ మ్యాచ్ ద్వారా అధిక ఆదాయం వస్తుందన్నాడు. తానైతే ఐసీసీ, బోర్డును నియంత్రించనని, ఒకవేళ భారత్, పాక్ ఆటగాళ్ల స్థానంలో తాను ఉంటే ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తానని (నవ్వుతూ) అన్నాడు. భారత్తోపాటు వెస్టిండీస్ చాలా కాలంగా ఐసీసీ ట్రోఫీని గెలవలేదని, స్వదేశంలో ఆడుతూ ఫేవరెట్గా బరిలోకి దిగే టీమ్ఇండియాపై ఒత్తిడి ఉంటుందని క్రిస్ గేల్ చెప్పాడు.
మూడు పెద్ద దేశాలు.. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్లో ఎక్కువ భాగం ఆడటం వల్ల ఆటకు నష్టం చేకూరుతుందని వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ క్రికెట్ అభివృద్ధి చెందాలంటే వెస్టిండీస్ వంటి చిన్న బోర్డుల ఆటగాళ్లకు మెరుగైన వేతనం చెల్లించాలని క్రిస్ గేల్ అభిప్రాయపడ్డాడు. “ఇంతకుముందుతో పోలిస్తే ప్రస్తుతం క్రికెట్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఇది పెద్ద వ్యాపారంగా మారిపోయింది. టీ20 లీగ్లతోనే కాకుండా టెస్టు క్రికెట్తోనూ చాలా డబ్బు వస్తోంది. చిన్న జట్ల కంటే పెద్ద జట్లకు ఎక్కువ ఆదాయం లభిస్తోంది. ఈ విధానంలో మార్పు రావాలి. ప్రతి జట్టు సమాన ప్రయోజనాలు పొందాలి. వెనుకబడిన, తక్కువ ర్యాంక్లో ఉన్న జట్లు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మరిన్ని మ్యాచ్లు ఆడాల్సిన అవసరముంది. ఆయా జట్ల కోసం మౌలిక సదుపాయాలను కల్పించాలి. పెద్ద జట్ల మాదిరిగానే చిన్న జట్ల ఆటగాళ్లకూ ఎక్కువ వేతనం ఇవ్వాలి’’అని క్రిస్ గేల్ అన్నాడు.
నవంబర్లో ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్
ఇదిలా ఉండగా.. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) మొదటి సీజన్ నవంబర్ 17, 2023 నుంచి ప్రారంభం కానుంది. ఈ వెటరన్ లీగ్లో వీరేంద్ర సెహ్వాగ్, సనత్ జయసూర్య, క్రిస్ గేల్, సురేష్ రైనా వంటి దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటారు. ఈ టోర్నమెంట్ను ఇండియన్ వెటరన్స్ క్రికెట్ బోర్డు, ఇండియన్ పవర్ క్రికెట్ అకాడమీ నిర్వహిస్తాయి. ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఒక్కో టీమ్లో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు, కనీసం ఐదుగురు మాజీ రంజీ ట్రోఫీ క్రికెటర్లు ఉండేలా నిబంధనలు రూపొందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్