india vs south africa: సచిన్ రికార్డును సమం చేసిన విరాట్.. దక్షిణాఫ్రికా లక్ష్యం 327
india vs south africa: వన్డే ప్రపంచకప్లో (ICC Cricket World Cup 2023) భాగంగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా 327 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు ముందుంచింది.
ఇంటర్నెట్ డెస్క్: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 101* (121 బంతుల్లో 10 ఫోర్లు) శతకంతో అదరగొట్టిన వేళ భారత జట్టు 327 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. పుట్టిన రోజున కోహ్లీ వన్డేల్లో తన 49వ శతకాన్ని పూర్తి చేసుకోవడం విశేషం. దీంతో సచిన్ రికార్డు (49)ను సమం చేశాడు. విరాట్తోపాటు శ్రేయస్ అయ్యర్ 77 (87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించాడు. ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ (22: 14 బంతుల్లో 5 ఫోర్లు), జడేజా (29; 15 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా ఆడేశారు.
అద్భుత భాగస్వామ్యం..
ఓపెనర్లు రోహిత్ శర్మ (40), శుభ్మన్ గిల్ (23) తొలి వికెట్కు 62 పరుగులు జోడించారు. రోహిత్ ఔటైన కాసేపటికే గిల్ కూడా పెవిలియన్కు చేరాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించడంతో పరుగుల రాక కష్టంగా మారింది. దీంతో విరాట్-శ్రేయస్ ఆచితూచి ఆడారు. మూడో వికెట్కు 134 పరుగులు జోడించారు. కానీ, మరోసారి సఫారీ జట్టు బౌలర్లు పుంజుకోవడంతో శ్రేయస్తోపాటు కేఎల్ రాహుల్ (8) పెవిలియన్కు చేరారు. కానీ, విరాట్-సూర్య దూకుడు ఆడి స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. సూర్య ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన జడేజా కూడా వేగంగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కోహ్లీ శతకం పూర్తి చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు ఎంగిడి, జాన్సెన్, రబాడ, కేశవ్, షంసీ తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!