IPL 2022: పంజాబ్ను ఎందుకు వీడాడో కారణం చెప్పిన కేఎల్ రాహుల్
ఐపీఎల్లో కొత్తగా చేరిన లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్గా నియమితుడైన కేఎల్ రాహుల్.. తన పాత జట్టు పంజాబ్ కింగ్స్ను ఎందుకు వీడాల్సి వచ్చిందో కారణం చెప్పాడు...
(Photo: KL Rahul Twitter)
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్లో కొత్తగా చేరిన లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్గా నియమితుడైన కేఎల్ రాహుల్.. తన పాత జట్టు పంజాబ్ కింగ్స్ను ఎందుకు వీడాల్సి వచ్చిందో కారణం చెప్పాడు. మెగా టోర్నీకి ముందు ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన అతడు అందుకు కారణాన్ని వివరించాడు.
‘నేను పంజాబ్ జట్టులో నాలుగేళ్లు ఆడా. అక్కడ భారీగా పరుగులు చేశా. అయితే, ఈ సీజన్కు ముందు నా కెరీర్లో వేరే కొత్త అవకాశాలేమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలని చూశా. పంజాబ్ను వీడడం కష్టతరమైన నిర్ణయమే. ఆ జట్టుతో చాలా కాలం ఆడిన నేపథ్యంలో ఈసారి కొత్తగా ఏమైనా చేయగలనా అని ఆలోచించా’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు. కాగా, పంజాబ్ను వీడడం రాహుల్ సొంత నిర్ణయమని ఆ జట్టు కోచ్ అనిల్కుంబ్లే ఇంతకుముందే వెల్లడించాడు.
‘మేం కచ్చితంగా రాహుల్ను అట్టిపెట్టుకోవాలని చూశాం. అందుకే రెండేళ్ల కిందటే అతడిని కెప్టెన్గా నియమించుకున్నాం. కానీ, అతడే వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతడి నిర్ణయాన్ని మేం గౌరవించాం. అది ఆటగాడి వ్యక్తిగత ఇష్టం’ అని కుంబ్లే ఈ ఏడాది వేలం పాటకు ముందు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా విడుదల చేసినప్పుడు వివరించాడు. కాగా, అప్పుడు పంజాబ్ కేవలం ఇద్దరి ఆటగాళ్లనే అట్ట్టిపెట్టుకుంది. అందులో ఒకరు మయాంక్ అగర్వాల్ కాగా, మరొకరు యువ ఆటగాడు అర్ష్దీప్ సింగ్. ఇక ఇటీవల మయాంక్ను కొత్త కెప్టెన్గానూ నియమించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా