సాక్షీ.. అతడు జూనియర్ మహీనా?
కరోనా వైరస్ ముప్పుతో లాక్డౌన్ అమలు చేయడంతో క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితయ్యారు. కుటుంబ సభ్యులతో హాయిగా కాలక్షేపం చేశారు. వారి పిల్లలతో ఆడారు. పాడారు. ముద్దూముచ్చట తీర్చారు. మైదానంలో నేరుగా కనిపించనప్పటికీ అభిమానులతో సోషల్ మీడియాలో మాత్రం టచ్లో ఉన్నారు...
సోషల్ మీడియాలో అభిమానుల ప్రశ్నలు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ ముప్పుతో లాక్డౌన్ అమలు చేయడంతో క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితయ్యారు. కుటుంబ సభ్యులతో హాయిగా కాలక్షేపం చేశారు. వారి పిల్లలతో ఆడారు. పాడారు. ముద్దూముచ్చట తీర్చారు. మైదానంలో నేరుగా కనిపించనప్పటికీ అభిమానులతో సోషల్ మీడియాలో మాత్రం టచ్లో ఉన్నారు. టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటారు. అయితే అతడి సతీమణి సాక్షి మాత్రం చురుగ్గా ఉంటుంది. కానీ కొన్నాళ్లుగా మునుపటి సందడి మాత్రం కనిపించడం లేదు.
తాజాగా సాక్షీసింగ్ ధోనీ ఇన్స్టాగ్రామ్లో ఓ చిత్రం పంచుకున్నారు. అందులో తన ముద్దుల కుమార్తె జీవా ఓ బుజ్జాయిని పట్టుకుంది. తదేకంగా అతడినే చూస్తోంది. ఈ పోస్టుకు సాక్షి ఎలాంటి వ్యాఖ్య పెట్టకపోవడంతో అభిమానుల్లో గుసగుసలు మొదలయ్యాయి. అతడు జూనియర్ మహీనా? అని కామెంట్లు పెడుతున్నారు. ఎంతో ముద్దుగా ఉన్నాడు. ఇంతకీ ఎవరితడు? జూనియర్ హార్దిక్ పాండ్యనా ఏంటి? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా మహీ రిటైర్మెంట్పై ఎన్నోసార్లు వేగంగా వివరణ ఇచ్చిన సాక్షి దీనిపై ఇంకా స్పందించకపోవడం గమనార్హం.
ఐపీఎల్-2020 తేదీలు ప్రకటించడంతో ప్రస్తుతం మహీ ఇంట్లోనే సాధన చేస్తున్నాడు. అంతకు ముందు రెండురోజులు ఝార్ఖండ్ మైదానంలోని ఇండోర్ స్టేడియంలో బౌలింగ్ యంత్రం సాయంతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడని తెలిసింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. త్వరలోనే చెన్నై సూపర్కింగ్స్ జట్టు సభ్యులు చెపాక్ శిబిరానికి వస్తున్నారు. 22న దుబాయ్కు వెళ్తున్నారని సమాచారం. ప్రయాణానికి 24 గంటల ముందు ఆటగాళ్లకు రెండు సార్లు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయనున్నారు. ఆ తర్వాత వారంతా బయో బుడగలోకి అడుగుపెడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
ఎవరా 15..!
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం