KL Rahul: ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ ఉంటే అతడితో కచ్చితంగా బౌలింగ్ చేయించేవాడిని: కేఎల్
ఉత్కంఠభరితంగా సాగిన రెండో టెస్టు మ్యాచ్లో భారత్ పోరాడి మరీ విజయం సాధించింది. మ్యాచ్ ముగిసేవరకు టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్తోపాటు అభిమానుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ ఎనిమిదో వికెట్కు కీలకమైన 71 పరుగుల భాగస్వామ్యం నిర్మించడంతో.. బంగ్లాదేశ్పై ఉత్కంఠభరితంగా సాగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ను టీమ్ఇండియా 2-0 తేడాతో కైవసం చేసుకొంది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన గంటలోపే కీలకమైన మూడు వికెట్లను కోల్పోవడంతో భారత శిబిరంలో టెన్షన్ పెరిగింది. చివరికి టీమ్ఇండియా విజయం సాధించడంతో కోచ్ రాహుల్ ద్రవిడ్తోపాటు సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు. తమ డ్రెస్సింగ్ రూమ్లోని పరిస్థితి గురించి మ్యాచ్ అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. అలాగే కుల్దీప్ యాదవ్ను ఎందుకు తీసుకోలేదో కూడా చెప్పాడు.
నిజం చెప్పాలంటే..
‘‘మిడిలార్డర్పై చాలా నమ్మకం ఉంది. తప్పకుండా మనల్ని గెలిపించడానికి కృషి చేస్తారని తెలుసు. ఇది గ్రహించడానికి ఇప్పటికే చాలా క్రికెట్ ఆడాం. కానీ నిజం చెప్పాలంటే మ్యాచ్ జరిగే కొద్దీ డ్రెస్సింగ్ రూమ్లో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. ప్రతి ఒక్కరిలోనూ టెన్షన్ వాతావరణం కనిపించింది. బ్యాటింగ్ చేయడానికి ఇది చాలా క్లిష్టమైన వికెట్. బంగ్లా బౌలర్లు మమ్మల్ని తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. కొత్త బంతిని ఎదుర్కోవడం చాలా కష్టం. బంతి పాతబడే కొద్దీ పరుగులు రాబట్టేందుకు అవకాశం ఉంది. అందుకే కొత్త బంతిని ఆడేవారికి చాలా కష్టం. ఛేజింగ్లో మేం అనుకొన్నదానికంటే కాస్త ఎక్కువ వికెట్లను కోల్పోయాం. చివరికి మ్యాచ్ను గెలవడం ఆనందంగా ఉంది’’
కుల్దీప్ను తీసుకోకపోవడంపై..
‘‘ గత కొన్నేళ్లుగా మా బౌలింగ్ ఎటాక్ అద్భుతంగా ఉంది. విదేశాల్లోనూ బౌలర్లు ఉత్తమ ప్రదర్శనతో రాణించారు. అయితే బంగ్లాతో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో కుల్దీప్ లేని లోటు కనిపించింది. కానీ తొలి రోజు పిచ్ను పరిశీలిస్తే స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అనిపించింది. అందుకే కుల్దీప్ను తీసుకోలేకపోయా. అయితే ఐపీఎల్లో ప్రవేశపెట్టబోయే ‘ఇంపాక్ట్ ప్లేయర్’ పద్ధతి టెస్టుల్లోనూ ఉంటే బాగుండేది. ఎందుకంటే బంగ్లాతో రెండో టెస్టులో ఆ రూల్ ఉంటే కచ్చితంగా రెండో ఇన్నింగ్స్లో కుల్దీప్ను బౌలింగ్కు తీసుకొచ్చేవాడిని. కుల్దీప్ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి నేనేమీ బాధపడటంలేదు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఫాస్ట్ బౌలర్లు ఎక్కువ వికెట్లు తీసిన సంగతిని మరిచిపోకూడదు. వన్డేల్లో ఆడిన అనుభవంతో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని వివరించాడు. మొదటి టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైన కుల్దీప్ను పక్కన పెట్టడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
రెండో టెస్టు మ్యాచ్లో ఇరు జట్లవి కలిపి 37 వికెట్లు పడ్డాయి. అందులో ఒకటి రనౌట్ కాగా.. ఫాస్ట్ బౌలర్లు 11 వికెట్లు, స్పిన్నర్లు 25 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లను భారత ఫాస్ట్ బౌలర్లు (ఉమేశ్ 4, జయ్దేవ్ 4) తీశారు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ నాలుగు వికెట్లు (సిరాజ్ 2, జయ్దేవ్ 1, ఉమేశ్ 1) తీశారు. కానీ భారత రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఏడు వికెట్లూ (మెహిదీ 5, షకిబ్ 2) బంగ్లా స్పిన్నర్లే పడగొట్టడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా