Rishabh Pant: ఒత్తిడిలో ఎలా ఆడాలో కోహ్లీ నేర్పుతాడు: పంత్
టీ20 ప్రపంచకప్ మెగా సమరాన్ని భారత్ దాయాది పోరుతో మొదలుపెట్టనుంది. ఆదివారం ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రిషభ్ పంత్ మాట్లాడుతూ.. పాక్తో మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమే అని తెలిపాడు.
మెల్బోర్న్: ఆటలో ఒత్తిడితో కూడుకున్న పరిస్థితులను ఎదుర్కోవడంలో విరాట్ కోహ్లీ అపార అనుభవం చాలా ఉపయోగపడుతుందని స్టార్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈ ఆదివారం భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్ వెబ్సైట్ పంత్ను ఇంటర్వ్యూ చేయగా.. అతడు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. పాక్తో మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుందన్న పంత్.. గతేడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో దాయాదుల పోరును గుర్తుచేసుకున్నాడు.
‘‘వాస్తవ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో కోహ్లీ నేర్పుతాడు. అది మన క్రికెట్ ప్రయాణానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అతడితో బ్యాటింగ్ చేయడం చాలా బాగుంటుంది. కోహ్లీ వంటి అనుభవజ్ఞుడితో కలిసి బ్యాటింగ్ చేయడం ఉత్తమం. దాని వల్ల మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. ఆటను ఎలా ముందుకు తీసుకెళ్లాలి.. ఒత్తిడి పరిస్థితుల్లో బంతులను పరుగులుగా ఎలా మలచాలి అన్నది నేర్పిస్తాడు’’ అని రిషభ్ తెలిపాడు.
ఈ సందర్భంగా గతేడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ - పాక్ మ్యాచ్ను ప్రస్తావిస్తూ.. ‘‘ఆ మ్యాచ్లో హసన్ అలీ బౌలింగ్లో నేను ఒకే ఓవర్లో రెండు సిక్సర్లు బాదాను. ఆ రోజు టీమిండియా మొదట్లోనే వికెట్లు కోల్పోయింది. దీంతో నేను, విరాట్ కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాం. రన్రేట్ను పెంచే ప్రయత్నం చేశాం. ఆ సమయంలోనే నేను ఒంటి చేత్తో రెండు సిక్స్లు కొట్టడం నాకు గుర్తుంది’’ అని పంత్ గుర్తుచేసుకున్నాడు.
అది భావోద్వేగాలతో కూడిన మ్యాచ్..
దాయాది పాకిస్థాన్తో మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుందని పంత్ అన్నాడు. ‘‘పాక్తో ఆట అంటే ఎంతో హైప్ ఉంటుంది. అది భావోద్వేగాలతో కూడుకున్న మ్యాచ్. ఆటగాళ్లకే కాదు.. అభిమానులు.. ప్రతి ఒక్కరూ ఎంతో ఉద్వేగంతో చూస్తారు. అదో విభిన్న అనుభూతి. మైదానంలోకి అడుగుపెట్టగానే ఆ కోలాహలం అంతా మరో స్థాయిలో ఉంటుంది. అందుకే పాక్తో ఆట ఎప్పుడూ ప్రత్యేకంగానే అనిపిస్తుంది’’ అని పంత్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
-
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్స్టాలో 4 కొత్త ఫీచర్లు
-
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. కరీంనగర్లో కూలిన టెంట్లు
-
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం