Sourav Ganguly: కోహ్లీ వల్లే.. ప్రపంచకప్ జట్టులోకి అశ్విన్: గంగూలీ
దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత టీ20 జట్టులోకి మళ్లీ అడుగుపెట్టాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. 2021 టీ20 ప్రపంచకప్ సమయంలో అతడిని తిరిగి జట్టులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్డెస్క్: దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత టీ20 జట్టులోకి మళ్లీ అడుగుపెట్టాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. 2021 టీ20 ప్రపంచకప్ సమయంలో అతడిని తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఆ టోర్నీలో భారత్ రాణించకపోయినా అశ్విన్ మాత్రం మాయ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో సత్తా చాటి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అశ్విన్ను తిరిగి వైట్ బాల్ జట్టులోకి తీసుకోవడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అశ్విన్ జట్టులో ఉండాలని విరాట్ కోహ్లీ కోరుకున్నాడని తెలిపారు.
‘‘అశ్విన్ మళ్లీ వైట్ బాల్ జట్టులో ఉంటాడని నేను అనుకోలేదు. కానీ 2021 ప్రపంచకప్ సమయంలో అశ్విన్ జట్టులో ఉండాలని అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ కోరుకున్నాడు. అయితే తనకొచ్చిన ఈ అవకాశాన్ని అశ్విన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. అతడిని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పుడు ప్రతిఒక్కరూ అతడి గురించి మాట్లాడుతున్నారు. కాన్పూర్ టెస్టు మ్యాచ్ తర్వాత రాహుల్ ద్రవిడ్ కూడా అశ్విన్ను ప్రశంసించాడు. ఆల్ టైం గ్రేట్ క్రికెటర్ అని అన్నాడు. అశ్విన్ టాలెంట్ను గుర్తించేందుకు రాకెట్ సైన్స్ అక్కర్లేదు. అతడి రికార్డులే చెబుతాయి. 2011లో ప్రపంచకప్ గెలిచిన భారత్ జట్టు, 2013లో ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన జట్టులో అశ్విన్ ఉన్నాడు. ఆ టోర్నమెంట్లలో అతడు లీడింగ్ బౌలర్ కూడా. ఇటీవల సీఎస్కే ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. ఆ జట్టుకు కూడా అతడు ప్రధాన బౌలరే. క్లిష్ట పరిస్థితుల్లో చక్కగా బంతులు విసరగలడు. అలాంటి ఆటగాళ్లను నిర్లక్ష్యం చేయొద్దు’’ అని ఓ చాట్షోలో గంగూలీ చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా