IND vs NZ: రెండో టెస్టుకు.. తుది జట్టులో మార్పులు చేయాలి : దీప్‌దాస్ గుప్తా

టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య డిసెంబరు 3 నుంచి జరుగనున్న రెండో టెస్టు కోసం.. తుది జట్టు కూర్పులో పలు మార్పులు చేయాలని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు దీప్‌దాస్‌ గుప్తా..

Published : 01 Dec 2021 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య డిసెంబరు 3 నుంచి జరుగనున్న రెండో టెస్టు కోసం.. తుది జట్టు కూర్పులో పలు మార్పులు చేయాలని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు దీప్‌దాస్‌ గుప్తా సూచించాడు. సీనియర్‌ పేసర్‌ ఇషాంత్ శర్మ స్థానంలో.. మహమ్మద్ సిరాజ్‌కి అవకాశమివ్వాలని పేర్కొన్నాడు.

‘ముంబయిలో జరుగనున్న రెండో టెస్టుకి సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ స్థానంలో మహమ్మద్‌ సిరాజ్‌ని తుది జట్టులోకి తీసుకోవాలి. అలాగే, తొలి టెస్టులో ఓపెనింగ్ చేసిన మయాంక్ అగర్వాల్‌ని.. మూడో స్థానంలో బ్యాటింగ్‌ పంపించాలి. ఎందుకంటే ఉపఖండ పిచ్‌లపై అతడు స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొని పరుగులు రాబట్టగలడు. దాంతో పాటు, భారత జట్టులో మిడిలార్డర్ బ్యాటింగ్‌కి తీవ్రమైన పోటీ ఉంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఈ టెస్టు సిరీస్‌కి దూరంగా ఉన్నారు. కాబట్టి, శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. సీనియర్లు జట్టులోకి వస్తే అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌ దిగాలి అనే విషయంలో గందరగోళం నెలకొంది. అందుకే, భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా గిల్‌ని ఇప్పటి నుంచే మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కి పంపించాలి. మరోవైపు, అరంగేట్ర ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌.. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కి దిగి శతకంతో ఆకట్టుకున్నాడు. కాబట్టి, మిడిలార్డర్‌లో అతడి స్థానం పదిలమైనట్లే’ అని దీప్‌దాస్ గుప్తా పేర్కొన్నాడు. ముంబయిలో జరగనున్న రెండో టెస్టుకి రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని